Speaker Pocharam: 25న ప్రతీ నియోజకవర్గoలో ప్లీనరీ సమవేశాలు..

ABN , First Publish Date - 2023-04-24T12:46:09+05:30 IST

కామారెడ్డి జిల్లా: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మంగళవారం (25వ తేదీ) ప్రతీ నియోజకవర్గoలో ప్లీనరీ సమవేశాలు నిర్వహిస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

Speaker Pocharam: 25న ప్రతీ నియోజకవర్గoలో ప్లీనరీ సమవేశాలు..

కామారెడ్డి జిల్లా: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ (Telangana Independence Day) సందర్భంగా మంగళవారం (25వ తేదీ) ప్రతీ నియోజకవర్గoలో ప్లీనరీ సమవేశాలు (Plenary Sessions) నిర్వహిస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Speaker Pocharam Srinivas Reddy) స్పష్టం చేశారు. ఈ సందర్బంగా సోమవారం బాన్సువాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశంలో స్పీకర్ హోదాలో కాకుండా నియోజకవర్గ ఎమ్మెల్యే హోదాలో పాల్గొంటానన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చేందుకు కొన్ని పార్టీలు పేపర్లు లీక్ చేసి డ్రామా ఆడుతున్నాయని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మాదిరి అన్ని రాష్ట్రాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లను, రైతు బంధు, రైతు భీమా పథకాలను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం ప్రభుత్వం కక్ష సాధింపు చర్యతో నేతలపై సీబీఐ, ఈడీ దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ (CM KCR) ధైర్యవంతుడని, ఎవరికి భయపడే మనిషి కాదన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ కొరకు 250 కోట్ల రూపాయలను కేటాయించామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-04-24T12:46:09+05:30 IST