Share News

Gutta Sukhender Reddy: కేసీఆర్‌పై దండయాత్రలా వస్తున్నారు..

ABN , First Publish Date - 2023-11-26T11:11:56+05:30 IST

లంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీజేపీ, కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ కేంద్ర అగ్ర నాయకులు సీఎం కేసీఆర్‌పై దండయాత్రలా వస్తున్నారని, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేలా కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోందని విమర్శించారు.

Gutta Sukhender Reddy: కేసీఆర్‌పై దండయాత్రలా వస్తున్నారు..

నల్గొండ: తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీజేపీ, కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ కేంద్ర అగ్ర నాయకులు సీఎం కేసీఆర్‌పై దండయాత్రలా వస్తున్నారని, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేలా కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోందని విమర్శించారు. సోషల్ మీడియాలో తాను కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నానని దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని, దేశంలో లేని పథకాలు తెలంగాణలోనే ఉన్నాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు విజన్ లేదని.. విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ ఒక్కరేనని గుత్తా సుఖేందర్ రెడ్డి కొనియాడారు.

Updated Date - 2023-11-26T11:11:57+05:30 IST