Telangana Election: ఎన్ని సీట్లు వచ్చినా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే: ఎంపీ అర్వింద్

ABN , First Publish Date - 2023-10-09T15:14:22+05:30 IST

తెలంగాణ ఎన్నికలు 2023లో ఎన్ని సీట్లు వచ్చినా బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 సీట్లు వచ్చినా.. 60 సీట్లు వచ్చినా తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని దీమా వ్యక్తం చేశారు.

Telangana Election: ఎన్ని సీట్లు వచ్చినా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే: ఎంపీ అర్వింద్

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలు 2023లో ఎన్ని సీట్లు వచ్చినా బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 సీట్లు వచ్చినా.. 60 సీట్లు వచ్చినా తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని దీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి సహా ఆర్మూర్, కోరుట్ల..‌ పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీకి తాను సిద్ధమని అన్నారు.


బీఆర్ఎస్‌తో కలసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని అర్వింద్ అన్నారు. కేసీఆర్‌తో కలిసే ప్రసక్తే లేదని స్వయంగా ప్రధాని మోదీ చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు రాబోతున్నారని అన్నారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-10-09T15:14:22+05:30 IST