MP Arvind: సొంత కుటుంబ సభ్యులతో ప్రమాదం.. సీఎం కేసీఆర్‌పై ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు..

ABN , First Publish Date - 2023-10-04T18:20:13+05:30 IST

సొంత కుటుంబ సభ్యులతో సీఎం కేసీఆర్‌కు ప్రమాదం ఉందని అనుమానం కలుగుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

MP Arvind: సొంత కుటుంబ సభ్యులతో ప్రమాదం.. సీఎం కేసీఆర్‌పై ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు..

హైదరాబాద్: సొంత కుటుంబ సభ్యులతో సీఎం కేసీఆర్‌కు ప్రమాదం ఉందని అనుమానం కలుగుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ సీఎం కేసీఆర్ ఎమయ్యాడోనన్న పరేషానీ మాకుంది. ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి తెలుసుకోవాల్సిన హక్కు ప్రజలకుంది. కేసీఆర్ తర్వాత సీఎం పదవి కోసం హరీష్ రావు, కేటీఆర్‌లు పోటీ పడుతున్నారు. తనకంటే జూనియర్ కేటీఆర్ సీఎం అవుతాడేమోనన్న ప్రస్టేషన్‌లో హరీష్ రావు ఉన్నాడు. రైల్వేస్టేషన్‌లో పిచ్చోడి లెక్క హరీష్ చిల్లరగా వ్యవహరించాడు. కేటీఆర్‌ను కరవటం వలనే కుక్కలు పిచ్చిగా మారాయి. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని కేసీఆర్ కాపాడుతున్నాడు. రేవంత్ రెడ్డిపై ఎందుకంత ప్రేమ? కేసీఆర్ సమాధానం చెప్పాలి’’ అని ఎంపీ అర్వింద్ అన్నారు.


కాంగ్రెస్ పార్టీలోకి నాయకులను కేసీఆరే పంపిస్తున్నారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. రానున్న‌ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ఫండింగ్ చేస్తారని, గెలిచాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోకి వెళతారని అన్నారు. ప్రధాని మోదీ కామెంట్స్‌పై ప్రజలకు ముఖ్యమంత్రి సమాధానం‌ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పసుపు బోర్డు రావడంతో ముఖం ఎక్కడ పెట్టుకోవాలో బీఆర్ఎస్ నేతలకు అర్థం కావటం‌ లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పసుపు బోర్డు వాస్తవ రూపంలోకి తీసుకొచ్చి చూపించామని అన్నారు. పసుపు బోర్డుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపినందుకు ధన్యవాదాలు తెలిపారు. పసుపు రైతుల దశాబ్దాల కల‌‌ మోదీ నెరవేర్చార అర్వింద్ కొనియాడారు.

Updated Date - 2023-10-04T18:20:13+05:30 IST