Sejal: నాకు మంత్రి కేటీఆర్ అన్యాయం చేశారు: సూసైడ్ నోట్‌లో శేజల్

ABN , First Publish Date - 2023-06-29T17:20:10+05:30 IST

తనకు మంత్రి కేటీఆర్ అన్యాయం చేశారని ఆరిజిన్ డెయిరీ సీఈవో శేజల్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.

Sejal: నాకు మంత్రి కేటీఆర్ అన్యాయం చేశారు: సూసైడ్ నోట్‌లో శేజల్

హైదరాబాద్: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై లైంగిక ఆరోపణలు చేస్తున్న ఆరిజిన్ డెయిరీ సీఈవో శేజల్ మరోసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హైదరాబాద్ పెద్దమ్మ గుడి వద్ద రోడ్డుపై శేజల్ అపస్మారక స్థితిలో పడివున్నారు. ఆమె బ్యాగులో నిద్రమాత్రలు, సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పెద్దమ్మ గుడి వద్ద శేజల్‌ను ఆదినారాయణ అనే వ్యక్తి వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కాగా చికిత్స కోసం ఆమెను ఆస్పత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తున్నారు. తెలంగాణ సర్కారు తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం లేదని శేజల్ సూసైడ్ లెటర్‌లో పేర్కొన్నారు. మాదాపూర్ వద్ద రోడ్డుపై శేజల్ నిద్రమాత్రలు మింగిననట్లు పోలీసులు తెలిపారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకున్నానని ఆమె పేర్కొన్నారు.

BRS-MLA.jpg

ఢిల్లీలోనూ కొన్నిరోజుల క్రితం శేజల్ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. సూసైడ్ నోట్‌లో శేజల్ సంచలన విషయాలను ప్రస్తావించింది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించాడని శేజల్ ఆరోపిస్తున్నారు. 6 నెలల నుంచి న్యాయం కోసం పోరాటుతున్నట్లు సూసైడ్ నోట్‌లో శేజల్ పేర్కొన్నారు. ప్రభుత్వ పెద్దలు న్యాయం చేస్తామని మాట తప్పారని ఆమె ఆరోపించారు.

సూసైడ్ నోట్‌లో శేజల్ ఏం చెప్పిందంటే..

''ఢిల్లీలో కేసీఆర్ ఇంటి ముందు నిరసన తెలుపుతున్నప్పుడు మంత్రి కేటీఆర్ కలిశారు. దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేటీఆర్‌తో పాటు పార్టీ పెద్దలు కూడా ఉన్నారు.

దుర్గం చిన్నయపై కచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని హామీ ఇచ్చారు. నన్ను హైదరాబాద్ వెళ్ళిపోమని చెప్పారు. వారం రోజులకి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. కానీ మొన్న కేటీఆర్ చేసిన వాఖ్యలు నన్ను నమ్మకద్రోహం చేసినట్టు అనిపించింది. నామీద లైంగిక దాడి జరగలేదు అని చెప్పాడు. నన్ను చంపడానికి దుర్గం చిన్నయ్య ప్రయత్నిస్తున్నాడు. నన్ను ఎప్పుడు చంపుతారో తెలియదు. పెద్దమ్మ తల్లి నన్ను కాపాడు" అని శేజల్ రాసింది.

Updated Date - 2023-06-29T17:45:04+05:30 IST