Share News

Minister Jupalli Krishna Rao: ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారింది

ABN , First Publish Date - 2023-12-10T23:16:39+05:30 IST

ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిందని ఏక్సైజ్ శాఖ, టూరిజం డెవలప్‌మెంట్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupalli Krishna Rao ) పేర్కొన్నారు. ఆదివారం నాడు తెలంగాణ సెక్రటేరియట్‌లో జూపల్లి కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు.

Minister Jupalli Krishna Rao: ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారింది

హైదరాబాద్: ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిందని ఏక్సైజ్ శాఖ, టూరిజం డెవలప్‌మెంట్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupalli Krishna Rao ) పేర్కొన్నారు. ఆదివారం నాడు తెలంగాణ సెక్రటేరియట్‌లో జూపల్లి కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ..తెలంగాణ వచ్చిన రోజు ఉన్న సంతోషం నేడు ప్రజల అందరిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి ప్రజలు కృతజ్ఞతలు తెలిపే విధంగా ఈ ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయి. శాఖ ఏదైనా న్యాయం చేస్తాము. అగ్ని ప్రమాదంపై ఉన్నతాదికారులకు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు పంపాము. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోసం పని చేస్తాము. వైన్ షాపుల టెండర్లు, బెల్ట్ షాపులపై త్వరలో సమీక్ష చేస్తాను’’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

Updated Date - 2023-12-10T23:16:43+05:30 IST