Share News

BJP : మూడో విడత జాబితాపై అధిష్టానంతో టీబీజేపీ నేతల చర్చలు

ABN , First Publish Date - 2023-11-01T10:26:24+05:30 IST

తెలంగాణకు చెందిన బీజేపీ కీలక నేతలంతా అధిష్టానంతో భేటీ అయ్యారు. ఢిల్లీలోనే బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, జవదేకర్, సునీల్ బన్సల్ ఉన్నారు.

BJP : మూడో విడత జాబితాపై అధిష్టానంతో టీబీజేపీ నేతల చర్చలు

ఢిల్లీ : తెలంగాణకు చెందిన బీజేపీ కీలక నేతలంతా అధిష్టానంతో భేటీ అయ్యారు. ఢిల్లీలోనే బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, జవదేకర్, సునీల్ బన్సల్ ఉన్నారు. మూడో విడత జాబితాపై చర్చలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ 53మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. మిగిలిన 66స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించనుంది. రేపు బీజేపీ మూడో లిస్ట్ విడుదలకానుంది. జనసేనతో పొత్తు, సీట్ల సర్దుబాటుపై హైకమాండ్‌తో బీజేపీ నేతలు సమాలోచనలు చేయనున్నారు. జనసేనకు 9 సీట్లు ఇచ్చే యోచనలో కమలం పార్టీ ఉంది.

Updated Date - 2023-11-01T10:26:24+05:30 IST