సిద్దిపేట సిగలో మరో మణిహారం ఈ శిల్పారామం: హరీశ్‌రావు

ABN , First Publish Date - 2023-04-22T22:31:25+05:30 IST

సిద్దిపేట సిగలో మరో మణిహారం ఈ శిల్పారామమని మంత్రి హరీశ్ రావు అన్నారు.

సిద్దిపేట సిగలో మరో మణిహారం ఈ శిల్పారామం: హరీశ్‌రావు

సిద్దిపేట: సిద్దిపేట సిగలో మరో మాణిారం ఈ శిల్పారామమని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో సముద్రం లేని లోటును కూడా తీరుస్తుందన్నారు. ఆర్టిఫిషియల్ బీచ్ కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పట్టణంలోని కొమటి చెరువు సమీపంలో శిల్పారామం నిర్మాణానికి మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. రంగనాయకసాగర్ గుట్టను ఒక డెస్టినేషన్ సెంటర్‌గా మార్చబోతున్నామని తెలిపారు. నిర్మించుడు గొప్ప కాదు.. నిలబెట్టుకోవడం గొప్ప అన్నారు. సాధారణంగా సర్కారు పనులు కడతాం కానీ నిలబెట్టుకోవడం ఉండదన్నారు. మరో నెలరోజుల్లో డైనోసార్ పార్క్ త్వరలోనే ప్రారంభించుకోబోతున్నామన్నారు. ఒక పట్టణం జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలంటే రిక్రియేషన్ కూడా అవసరమేనన్నారు. ప్రజలకు మానసిక ఆనందం, శారీరక ఉల్లాసం కూడా అవసరమన్నారు. శిల్పారామంలో ఆర్ట్, కల్చరల్ ఆక్టివిటీస్ ఉంటాయన్నారు. ఒక అద్భుతమైన ప్రపంచాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నామని సంతోషాన్ని వ్యక్తం చేశారు. సిద్దిపేటలో 92 శాతం చెత్త డంప్ యార్డుకు వెళ్లడం లేదన్నారు. పర్యావరణ చైతన్యం సిద్దిపేటలో వచ్చిందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో సిద్దిపేట అభివృద్ధి చెందుతుందన్నారు. నాలుగు నెలల్లో శిల్పారామం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. కళలకు వేదికగా ఈ శిల్పారామం నిలుస్తదన్నారు.

Updated Date - 2023-04-24T17:10:33+05:30 IST