Nagar Kurnool Dist.: జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరికలు

ABN , First Publish Date - 2023-08-30T12:09:29+05:30 IST

నాగర్ కర్నూల్ జిల్లా: కొల్లాపూర్ కాంగ్రెస్ (Congress) పార్టీ కార్యాలయంలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో పలువరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బోరాబండతండా, సున్నపుతాండవాసులకు జూపల్లి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Nagar Kurnool Dist.: జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరికలు

నాగర్ కర్నూల్ జిల్లా: కొల్లాపూర్ కాంగ్రెస్ (Congress) పార్టీ కార్యాలయంలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు (Ex Minister Jupalli Krishnarao) ఆధ్వర్యంలో పలువరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బోరాబండతండా, సున్నపుతాండవాసులకు జూపల్లి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ (CM KCR), బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt.)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ దిగజారిన రాజకీయం చేస్తున్నారని, అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు.

సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు నాయకులను సీఎం కేసీఆర్ కొనుగోలు చేస్తున్నారని జూపల్లి కృష్ణారావు విమర్శించారు. రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి గ్రామస్థాయి నాయకుల వరకు వేల కోట్లలో, లక్షలలో కొనుగోలు చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. అమ్ముడు పోయిన, కొనుగోలు చేసే నాయకులను గ్రామాలలో అడుగుపెట్టకుండా చేయాలని, తిరగబడి తరిమి కొట్టాలని పిలుపిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Updated Date - 2023-08-30T12:09:29+05:30 IST