Share News

BRS Ex MLA: పార్టీలో ఎవ్వడు ఏ మోసం చేసిండో చూపిస్తా.. నన్నేం చేస్తార్రబై

ABN , Publish Date - Dec 15 , 2023 | 10:25 AM

Telangana: ‘‘పార్టీలో ఉండి ఎవ్వడు ఏ మోసం చేసిండో చూపిస్తా.. నాకు ఆల్రెడీ 55 సంవత్సరాలు క్రాస్ అయ్యాయి ఇంకా నన్ను ఏం చేస్తార్ర బై.. ఒక్కొక్కడిని ఆట ఆడుకుంటా వేట మొదలైంది. కేసీఆర్ హాస్పిటల్‌లో ఉండి బుక్స్ చదువుతున్నాడు, భవిష్యత్తు ఎలా చెయ్యాలని... శంకర్ నాయక్, కేసీఆర్ ఒక్క కార్తెలోనే పుట్టాం బిడ్డ.

BRS Ex MLA: పార్టీలో ఎవ్వడు ఏ మోసం చేసిండో చూపిస్తా.. నన్నేం చేస్తార్రబై

మహబూబాబాద్: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పార్టీలో ఉండి ఎవ్వడు ఏ మోసం చేసిండో చూపిస్తా.. నాకు ఆల్రెడీ 55 సంవత్సరాలు క్రాస్ అయ్యాయి ఇంకా నన్ను ఏం చేస్తార్రబై.. ఒక్కొక్కడిని ఆట ఆడుకుంటా వేట మొదలైంది. కేసీఆర్ హాస్పిటల్‌లో ఉండి బుక్స్ చదువుతున్నాడు, భవిష్యత్తు ఎలా చెయ్యాలని... నేను, కేసీఆర్ ఒక్క కార్తెలోనే పుట్టాం బిడ్డ. కార్యకర్తలను కాపాడుకునే సత్తా నాకు పుష్కలంగా ఉంది. రాత్రి 12 గంటలకు ఆపద వచ్చిన ఫోన్ చేయండి వస్తా. నీకు ధైర్యం ఉంటే నా కార్యకర్తను ముట్టుకో, తర్వాత ఏమైతదో చూసుకో. ఇన్నిరోజులు ఎమ్మెల్యే పదవి ఉంది కాబట్టే అలోచించాను, ఇప్పుడు మనల్ని ఆపేటోడు లేడు. ఒక్క అయ్య అవ్వకు పుట్టి ఉంటే, నేను చేసిన తప్పులను నిరూపించాలని నాపై ఆరోపణలు చేసిన వారికీ సవాల్ చేసిన కానీ ఎవ్వడు రాలే. మనం ఎవ్వరి జోలికి పోవొద్దు, మన జోలికి వస్తే వదిలిపెట్టొద్దు. కార్యకర్తకు ఆపద వస్తే మెరుపు వేగంతో వస్తా... మీకు అండగా నిలబడుతా’’ అంటూ శంకర్ నాయక్ కామెంట్స్‌ చేశారు. అయ్యప్ప మాలధారణలో ఉండి మరీ శంకర్ నాయక్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే శంకర్‌నాయక్ ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

Updated Date - Dec 15 , 2023 | 02:05 PM