KTR: బండి సంజయ్‌పై కేటీఆర్‌ సెటైర్లు

ABN , First Publish Date - 2023-04-10T21:05:29+05:30 IST

బీజేపీ నేత బండి సంజయ్‌ (Bandi Sanjay)పై మంత్రి కేటీఆర్‌ (KTR) సెటైర్లు విసిరారు. ‘‘కరీంనగర్‌లో ఒకాయన మోదీని దేవుడు అంటున్నాడు.

KTR: బండి సంజయ్‌పై కేటీఆర్‌ సెటైర్లు

సిరిసిల్ల: బీజేపీ నేత బండి సంజయ్‌ (Bandi Sanjay)పై మంత్రి కేటీఆర్‌ (KTR) సెటైర్లు విసిరారు. ‘‘కరీంనగర్‌లో ఒకాయన మోదీని దేవుడు అంటున్నాడు. మోదీ ఎవరికి దేవుడో అడిగితే జవాబే లేదు. లీటర్‌ పెట్రోల్‌ రూ.110 చేసినందుకు మోదీ దేవుడా?... తెలంగాణ (Telangana)కు ఒక్క యూనివర్సిటీ ఇవ్వనందుకు దేవుడా?.. సికింద్రాబాద్‌ (Secunderabad)లో ఒక్క రైలుకు జెండా ఊపేందుకు అందరూ వెళ్లారు. మాట్లాడితే చాలు మసీదులు తవ్వుదామంటారు. నిన్ను ఎన్నుకుంది మసీదులు తవ్వేందుకేనా?’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Updated Date - 2023-04-10T21:05:45+05:30 IST