Rega Kantha Rao: తెలంగాణ అభివృద్ధికి ఆయనే కారణం

ABN , First Publish Date - 2023-07-01T15:19:06+05:30 IST

కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే తెలంగాణ అభివృద్ధి చెందింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పోడు భూముల పట్టాల పంపిణీ చరిత్రలో నిలుస్తుంది. గిరిజనులకు పోడు భూములను సాధించలేని కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఏమి చేయగలరు. మాయ మాటలు చెప్పే వారి వల్ల ఏమీ కాదు.

Rega Kantha Rao: తెలంగాణ అభివృద్ధికి ఆయనే కారణం

భద్రాద్రి కొత్తగూడెం: కేసీఆర్ ముఖ్యమంత్రి (CM KCR) అయ్యాకే తెలంగాణ అభివృద్ధి చెందింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు (BRS MLA Rega Kantha Rao) అన్నారు. మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పోడు భూముల పట్టాల పంపిణీ చరిత్రలో నిలుస్తుంది. గిరిజనులకు పోడు భూములను సాధించలేని కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఏమి చేయగలరు. మాయ మాటలు చెప్పే వారి వల్ల ఏమీ కాదు. రాష్ట్ర చరిత్రలోనే పోడు భూముల పట్టాలు పంపిణీ గొప్ప విషయం. కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యవంతులు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కనీసం మంచినీళ్లు ఇవ్వలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను ఉద్దరిస్తారంటే ఎవరు నమ్మరు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఖమ్మం జిల్లాలో గెలిచేది బీఆర్ఎస్‌నే. ఉమ్మడి జిల్లాలో పదికి పది గెలిచితీరుతాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శిస్తే ఖబడ్దార్.’’ అంటూ రేగా కాంతారావు ఘాటుగా హెచ్చరించారు.

Updated Date - 2023-07-01T15:19:55+05:30 IST