Share News

Janasena, BJP: ఇవాళ కూకట్‌పల్లికి అమిత్‌షా, పవన్‌కళ్యాణ్‌

ABN , First Publish Date - 2023-11-26T12:09:41+05:30 IST

జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం కూకట్‌పల్లిలో విజయ సంకల్ప సభ నిర్వహిస్తున్నారు. హుడా ట్రక్‌ పార్క్‌ మైదానంలో సాయంత్రం

Janasena, BJP: ఇవాళ కూకట్‌పల్లికి అమిత్‌షా, పవన్‌కళ్యాణ్‌

కూకట్‌పల్లి(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం కూకట్‌పల్లిలో విజయ సంకల్ప సభ నిర్వహిస్తున్నారు. హుడా ట్రక్‌ పార్క్‌ మైదానంలో సాయంత్రం 3 గంటలకు సభ ప్రారంభం అవుతుందని జనసేన, బీజేపీ(Janasena, BJP) ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమకుమార్‌ తెలిపారు. సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌(Pawan Kalyan), ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పాల్గొంటారని పేర్కొన్నారు. సభ ఏర్పాట్లను బీజేపీ, జనసేన నాయకులతో కలిసి ప్రేమకుమార్‌ శనివారం పరిశీలించారు. కార్యకర్తలు అభిమానులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

చిరంజీవి అభిమానుల సంఘం మద్దతు

అఖిల భారత చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడు రావణం స్వామి నాయుడు ప్రేమకుమార్‌ను శనివారం కలిసి మద్దతు ప్రకటించారు. చిరంజీవి అభిమానులు ప్రేమకుమార్‌ గెలుపునకు కృషి చేయాలని స్వామినాయుడు పిలుపునిచ్చారు.

Updated Date - 2023-11-26T12:09:43+05:30 IST