YS Sharmila: మహారాష్ట్ర రైతులను ముంచే పనిలో కేసీఆర్

ABN , First Publish Date - 2023-05-20T13:26:46+05:30 IST

తెలంగాణలో రైతు సమాధులపై దాష్టీక పాలన నడుపుతున్న కేసీఆర్.. ఇప్పుడు మహారాష్ట్ర రైతులను ముంచే పనిలో పడ్డారని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు.

YS Sharmila: మహారాష్ట్ర రైతులను ముంచే పనిలో కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణలో రైతు సమాధులపై దాష్టీక పాలన నడుపుతున్న కేసీఆర్.. ఇప్పుడు మహారాష్ట్ర రైతులను ముంచే పనిలో పడ్డారని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో (Telangana) బుడ్డ దొరలకు, జమీందార్లకు, ఉద్యమద్రోహులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి.. మహారాష్ట్రలో మాత్రం రైతులు అసెంబ్లీకి పోవాలంటూ గప్పాలు కొడుతుండు పెద్ద దొర అంటూ దుయ్యబట్టారు. ‘‘మీరు చెప్పే తెలంగాణ మోడల్ అంటే.. తొమ్మిదేండ్లలో 9 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమా?.. పంట బీమా ఇవ్వక పోవడమా?.. పంట నష్టం జరిగితే మాట ఇచ్చి పరిహారం ఎగ్గొట్టడమా?... రాయితీ ఎరువులు, విత్తనాలు ఎత్తేయడమా?.. బడా బాబులకు రూ.వేల కోట్ల రైతుబంధు దోచిపెట్టడమా?.. ప్రాజెక్టుల పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకోవడమా?... కనీస కనికరం లేకుండా రైతుల భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమా?.. అసైన్డ్ భూములను సైతం లాక్కొని రైతును రోడ్డునపడేయడమా?.. కౌలు రైతు.. రైతే కాదని చెప్పడమా?.. వరి వేస్తే ఉరేనని రైతులను బెదిరించడమా?.. కేసీఆర్‌కు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, నీది నిజంగానే కిసాన్ సర్కార్ అయితే.. రుణమాఫీ చేయనందుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119 చోట్ల రైతులకే టికెట్లు ఇవ్వాలి. దళిత రైతును ముఖ్యమంత్రి చేసి, ఇతర రైతులను మంత్రులను చేయాలి. మాట ఇస్తే.. తలనరుక్కునే ముఖ్యమంత్రికి ఈ దమ్ముందా?’’ అంటూ షర్మిల సవాల్ విసిరారు.

Updated Date - 2023-05-20T13:26:46+05:30 IST