Vijayashanthi : రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈసారి కూడా బీజేపీకి అనుకూలంగానే ఫలితాలు

ABN , First Publish Date - 2023-05-25T14:06:21+05:30 IST

పార్లమెంట్‌కు ప్రతిపక్షాలను దేశ ప్రజలే ఎంపీలుగా సరైన సంఖ్యలో పంపటం గత రెండు ఎన్నికల నుంచి జరగలేదని బీజేపీ నాయకురాలు విజయశాంతి తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కూడా అదే ఫలితాలను బీజేపీకి అనుకూలంగా మరోసారి ఇవ్వడం స్పష్టమని అనిపిస్తోందన్నారు.

Vijayashanthi : రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈసారి కూడా బీజేపీకి అనుకూలంగానే ఫలితాలు

హైదరాబాద్ : పార్లమెంట్‌కు ప్రతిపక్షాలను దేశ ప్రజలే ఎంపీలుగా సరైన సంఖ్యలో పంపటం గత రెండు ఎన్నికల నుంచి జరగలేదని బీజేపీ నాయకురాలు విజయశాంతి తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కూడా అదే ఫలితాలను బీజేపీకి అనుకూలంగా మరోసారి ఇవ్వడం స్పష్టమని అనిపిస్తోందన్నారు. నూతన పార్లమెంట్ భవన ప్రారంభ కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీలు కొన్ని బాయ్‌కాట్ చెయ్యడం అనే నిర్ణయం ఇప్పటికే ఆ పార్టీలు పార్లమెంట్‌కు వెళ్లొద్దనే... ప్రజల అభిప్రాయాన్ని ఎంతో కొంత గౌరవించడమే కావచ్చని విజయశాంతి సెటైర్ వేశారు.

Updated Date - 2023-05-25T14:06:21+05:30 IST