Kishanreddy: కర్ణాటకలో మేము చేసిన తప్పులే బీజేపీని ముంచాయి

ABN , First Publish Date - 2023-05-13T15:35:35+05:30 IST

కర్ణాటకలో బీజేపీ ఓటమిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు.

Kishanreddy: కర్ణాటకలో మేము చేసిన తప్పులే బీజేపీని ముంచాయి

హైదరాబాద్: కర్ణాటకలో బీజేపీ ఓటమిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Union Kishan Reddy) స్పందించారు. కర్ణాటకలో తాము చేసిన తప్పులే బీజేపీని ముంచాయన్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం (BJP Government) చేసిన పొరపాట్లు కారణంగానే తాము ఓడిపోయామని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ ఒక తప్పు చేస్తే.. తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) వంద తప్పులు చేసిందన్నారు. రానున్న‌ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేస్తారని తెలిపారు. కర్ణాటక ప్రజల తీర్పును శిరసా వహిస్తామన్నారు. తప్పులను సరిచేసుకుని లోకసభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్లే తాము ఓడిపోయామన్నారు. తొందర్లోనే తమకు ఉన్న లోపాలను సరిదిద్దుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో బీఆర్ఎస్‌కు బాగా ధైర్యం వస్తుందోన్న‌ ప్రచారం ఒట్టిదే అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-05-13T15:35:35+05:30 IST