TSPSC: గ్రూప్‌ 1 హాల్‌ టికెట్‌ వివాదంపై టీఎస్‌పీఎస్సీ క్లారిటీ

ABN , First Publish Date - 2023-06-12T16:48:07+05:30 IST

ఇప్పటికే పేపర్ లీకేజీలతో సతమతమవుతున్న టీఎస్‌పీఎస్సీకి మరో కొత్త వివాదం పెద్ద దుమారం రేపింది. దరఖాస్తు చేయకుండానే

TSPSC: గ్రూప్‌ 1 హాల్‌ టికెట్‌ వివాదంపై టీఎస్‌పీఎస్సీ క్లారిటీ
TSPSC

హైదరాబాద్: ఇప్పటికే పేపర్ లీకేజీలతో సతమతమవుతున్న టీఎస్‌పీఎస్సీకి (TSPSC) మరో కొత్త వివాదం పెద్ద దుమారం రేపింది. దరఖాస్తు చేయకుండానే హాల్‌ టికెట్‌ వచ్చిందంటూ నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ వాసి సుచిత్ర ఆరోపణలు చేసింది. అయితే అభ్యర్థి చేసిన ఆరోపణలపై టీఎస్‌పీఎస్సీ స్పందించింది. గ్రూప్-1కు సుచిత్ర దరఖాస్తు చేసుకుందని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. గత అక్టోబర్‌లో పరీక్ష రాసినట్లు తెలిపింది. పరీక్షకు సుచిత్ర హాజరైనట్లు రికార్డ్స్‌ ఉన్నాయని వెల్లడించింది. ఇదిలా ఉంటే ప్రిలిమ్స్‌ ప్రశాంతంగా ముగిసాయని పేర్కొంది.

గతంలో నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లో కుంభకోణం జరగడంతో ఆ పరీక్షలను రద్దు చేసింది. ఈ స్కామ్‌లో కోట్లలో చేతులు మారాయి. ఈ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని సిట్ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసి జైలుకు పంపించింది.

Updated Date - 2023-06-12T16:48:07+05:30 IST