Cell Phones Theft: సికింద్రాబాద్‌లో పోలీసుల సెర్చ్ ఆపరేషన్‌ .. భారీ చోరీలు చేస్తున్న నిందితుల ఆగడాలకు చెక్

ABN , First Publish Date - 2023-09-04T16:33:49+05:30 IST

సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి(Boinpally)లో మరోసారి దొంగలు రెచ్చిపోయారు. నగరంలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్‌(Police search operation) చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో సెల్ ఫోన్ల చోరీ(Cell Phones Theft)లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

Cell Phones Theft: సికింద్రాబాద్‌లో పోలీసుల సెర్చ్ ఆపరేషన్‌ .. భారీ చోరీలు చేస్తున్న నిందితుల ఆగడాలకు చెక్

సికింద్రాబాద్‌(Secunderabad): సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి(Boinpally)లో మరోసారి దొంగలు రెచ్చిపోయారు. నగరంలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్‌(Police search operation) చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో సెల్ ఫోన్ల చోరీ(Cell Phones Theft)లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల దగ్గరి నుంచి ఆరు లక్షల విలువైన 19 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బోయిన్‌పల్లిలో ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను నిందితులు చోరీ చేశారు. సెల్‌ఫోన్‌ పోవడంతో ప్రయాణికుడు బోయిన్‌పల్లిలోని పోలీసు‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుతో పోలీసులు బోయిన్‌పల్లిలో తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో నిందితులైన ఆటో డ్రైవర్లే ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రయాణికుల దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్నారని.. ఇలాంటి వారి పట్ల ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-09-04T16:33:49+05:30 IST