MLC Kavitha : గవర్నర్ తమిళిసై ప్రభుత్వ ప్రతిపాదనల తిరస్కరణపై కవిత రియాక్షన్

ABN , First Publish Date - 2023-09-26T11:04:04+05:30 IST

ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌కుమార్‌, కుర్రా సత్యనారాయణను నామినేట్‌ చేయాలంటూ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తిరస్కరించిన విషయం తెలిసిందే.

MLC Kavitha : గవర్నర్ తమిళిసై ప్రభుత్వ ప్రతిపాదనల తిరస్కరణపై కవిత రియాక్షన్

హైదరాబాద్ : ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌కుమార్‌, కుర్రా సత్యనారాయణను నామినేట్‌ చేయాలంటూ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై నేడు ఎమ్మెల్సీ కవిత స్పందించారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా అసెంబ్లీ హాల్లో ఐలమ్మ చిత్రపటానికి మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ కవిత, ఎంపి వెంకటేష్ నేత నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్ నుంచి ప్రకటన వెలువడిందన్నారు. రాజ్యాంగ బద్దంగా ఉన్న పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి నిర్ణయాలు సరికాదని కవిత పేర్కొన్నారు.

Updated Date - 2023-09-26T11:04:04+05:30 IST