Share News

TS NEWS: మియాపూర్‌లో అదృశ్యం అయిన యువకుడు ఆత్మహత్య

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:47 PM

మియాపూర్‌లో అదృశ్యం అయిన యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ డాల్ఫిన్ దుర్గా కౌంటీ 216లో పవన్ కళ్యాణ్ (25) నివాసం ఉంటున్నాడు.

TS NEWS: మియాపూర్‌లో అదృశ్యం అయిన యువకుడు ఆత్మహత్య

మియాపూర్: మియాపూర్‌లో అదృశ్యం అయిన యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ డాల్ఫిన్ దుర్గా కౌంటీ 216లో పవన్ కళ్యాణ్ (25) నివాసం ఉంటున్నాడు. ఈ నెల 14వ తేదీన ఉదయం 10 గంటలకు ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూ ఉందని ఇంట్లో చెప్పి పవన్ కళ్యాణ్ వెళ్లాడు. రాత్రి అయినా పవన్ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో పవన్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆదివారం మధ్యాహ్నం దీప్తిశ్రీనగర్‌లోని ధర్మపురి క్షేత్రంలోని చెట్ల పొదల్లో ఓ వ్యక్తి శవం పడి ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారంతో ఘటనాస్థలికి వెళ్లి పోలీసులు పరిశీలించగా మృతుడు పెట్రోల్ పోసుకొని తగులబెట్టుకొని మరణించినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి బావ అనుదీప్ ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Dec 17 , 2023 | 11:47 PM