Kishanreddy: హోంగార్డు రవీందర్ మృతిపట్ల కిషన్‌రెడ్డి విచారం

ABN , First Publish Date - 2023-09-08T11:43:10+05:30 IST

హోంగార్డ్ రవీందర్ మృతిపట్ల కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

Kishanreddy: హోంగార్డు రవీందర్ మృతిపట్ల కిషన్‌రెడ్డి విచారం

హైదరాబాద్: హోంగార్డ్ రవీందర్ మృతిపట్ల కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Telangana BJP Chief Kishan reddy) విచారం వ్యక్తం చేశారు. రెండురోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన హోంగార్డ్ రవీందర్.. చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. రవీందర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇది ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వం చేసిన హత్యే అని ఆరోపించారు. హోంగార్డ్‌లకు కనీస ఆత్మగౌరవాన్ని కూడా ఇవ్వకుండా.. వేధిస్తున్న బీఆర్ఎస్ సర్కారు తీరును తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ‘‘హోంగార్డ్‌లకు విజ్ఞప్తి. తొందరపడొద్దు. ఆత్మహత్యలే మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కాదు. పోరాడి సాధించుకుందాం తప్ప.. ఆత్మహత్యలు చేసుకొవద్దు’’ కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-09-08T11:43:10+05:30 IST