Kishan Reddy : తెలంగాణ అభివృద్ధికి మోదీ సర్కార్ కట్టుబడి ఉంది

ABN , First Publish Date - 2023-10-10T20:21:09+05:30 IST

తెలంగాణ అభివృద్ధికి మోదీ సర్కార్ కట్టుబడి ఉందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి( Kishan Reddy) వ్యాఖ్యానించారు.

 Kishan Reddy : తెలంగాణ అభివృద్ధికి మోదీ సర్కార్ కట్టుబడి ఉంది

హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి మోదీ సర్కార్ కట్టుబడి ఉందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి( Kishan Reddy) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్లో అమిత్ షా ఆధ్వర్యంలో మేధావుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణలో 9 లక్షల కోట్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం ఇచ్చింది. 3 వందే భారత్ ట్రైన్లు హైదరాబాద్ నుంచి వెళ్తున్నాయి. రింగురోడ్డు తెలంగాణ అభివృద్ధికి గేమ్ ఛేంజర్ అవుతుంది. నరేంద్ర మోదీ ఎజెండా వికాస్. నరేంద్ర మోదీని మరోసారి ఆశీర్వదించండి. తెలంగాణలో మంచి సర్కార్‌ను అందిస్తాం. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే వచ్చే ప్రభుత్వం నడవలేదు. డబ్బుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ టెండర్ వేసింది. ముందుగానే మద్యం టెండర్లు వేసింది. విలువైన భూములు అమ్ముకుంటుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-10-10T20:21:09+05:30 IST