Share News

TS Election: ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న జనసేన-బీజేపీ!

ABN , First Publish Date - 2023-10-18T14:15:16+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana assembly elections) ఉమ్మడిగా బరిలోకి దిగాలని జనసేన-బీజేపీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

TS Election: ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న జనసేన-బీజేపీ!

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana assembly elections) ఉమ్మడిగా బరిలోకి దిగాలని జనసేన-బీజేపీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఉదయం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో (Pawan Kalyan) రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishan Reddy), ఎంపీ లక్ష్మణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పొత్తులపై చర్చించినట్లు సమాచారం. కలిసి బరిలోకి దిగాలని జనసేనానితో కిషన్‌రెడ్డి చర్చించారు. ఇదిలా ఉంటే ఇవాళ సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. కసరత్తు పూర్తి చేసి రేపు తొలి విడత జాబితాను బీజేపీ ప్రకటించనుంది.

ksje.jpghwew.jpg

kfe.jpg

Updated Date - 2023-10-18T15:00:32+05:30 IST