Share News

Revanth Reddy: రేవంత్‌ రాకపై స్పందించిన జానారెడ్డి

ABN , First Publish Date - 2023-12-11T14:02:07+05:30 IST

సీఎం రేవంత్ రెడ్డి నేడు మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికి వెళ్లారు. కొత్త సర్కార్ కు సహకరించాలని రేవంత్ కోరారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. సర్కారులో ఇబ్బందులను, బాధలను తెలియజేయడం శుభపరిణామమన్నారు. సీఎం రేవంత్ తనను కలిశారని.. ప్రజాభిమానం చూరగొనేలా పనిచేయాలని చెప్పానన్నారు.

Revanth Reddy: రేవంత్‌ రాకపై స్పందించిన జానారెడ్డి

హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి నేడు మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికి వెళ్లారు. కొత్త సర్కార్ కు సహకరించాలని రేవంత్ కోరారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. సర్కారులో ఇబ్బందులను, బాధలను తెలియజేయడం శుభపరిణామమన్నారు. సీఎం రేవంత్ తనను కలిశారని.. ప్రజాభిమానం చూరగొనేలా పనిచేయాలని చెప్పానన్నారు. ప్రభుత్వంలో తన పాత్ర ఏమి ఉండదన్నారు. కానీ తన సలహాలు, సూచనలు కావాలంటే ఇస్తానన్నారు. కేసీఆర్ హాస్పిటల్‌లో ఉండడం చాలా బాధాకరమన్నారు. తాను వెళ్లి కలిసే ప్రయత్నం చేశాను కానీ కేసీఆర్ నిద్రలో ఉన్నారని జానారెడ్డి తెలిపారు. కేటీఆర్, హరీష్‌లను కలిశానన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. పార్లమెంట్‌కు పోటీ చేస్తానని గతంలో చెప్పానన్నారు. అధిష్టానం ఆదేశిస్తే ఆలోచిస్తానని తెలిపారు.

Updated Date - 2023-12-11T14:02:09+05:30 IST