Share News

TS News: రంగారెడ్డిలో భారీగా ఎండు గంజాయి పట్టివేత

ABN , Publish Date - Dec 30 , 2023 | 02:19 PM

Telangana: జిల్లాలో రెండు కిలోల 70 గ్రాముల ఎండు గంజాయి ప్యాకెట్లు పట్టుబడ్డాయి. బైక్‌లో తరలిస్తున్న రెండు కిలోల 70 గ్రాముల ఎండు గంజాయి ప్యాకెట్లను శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.

TS News: రంగారెడ్డిలో భారీగా ఎండు గంజాయి పట్టివేత

రంగారెడ్డి: జిల్లాలో రెండు కిలోల 70 గ్రాముల ఎండు గంజాయి ప్యాకెట్లు పట్టుబడ్డాయి. బైక్‌లో తరలిస్తున్న రెండు కిలోల 70 గ్రాముల ఎండు గంజాయి ప్యాకెట్లను శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్ నుంచి కటేధాన్ వెళ్లే దారిలో గగన్ పహాడ్ వద్ద గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రూ.2.5 లక్షల విలువ గల ఎండు గంజాయి, మూడు సెల్ ఫోన్లు, ఒక బైక్, స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజయ్ పటేల్, బీహార్‌కు చెందిన అనిల్, హర్యానాకు చెందిన కాళిల్‌గా గుర్తించారు.

Updated Date - Dec 30 , 2023 | 02:20 PM