Mirakumar: సోనియా.. తెలంగాణ ఎందుకు ఇచ్చారో చెప్పిన మీరాకుమార్

ABN , First Publish Date - 2023-06-02T15:51:34+05:30 IST

సోనియా మాత్రమే తెలంగాణ ప్రజలను అర్థం చేసుకున్నారు. ఈ వేదికపై విప్లవకారులు కూర్చున్నందుకు

Mirakumar: సోనియా.. తెలంగాణ ఎందుకు ఇచ్చారో చెప్పిన మీరాకుమార్
Mirakumar

హైదరాబాద్: తెలంగాణ ప్రజల బాధలు చూసి సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ గుర్తుచేశారు. గాంధీ‌భవన్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. ‘‘తెలంగాణ ప్రజల బాధ అర్థం చేసుకున్న సోనియాకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ ప్రజలను అందరూ మోసం చేశారు. తెలంగాణ సమస్య ఎవరు వినలేదు. సోనియా మాత్రమే తెలంగాణ ప్రజలను అర్థం చేసుకున్నారు. ఈ వేదికపై విప్లవకారులు కూర్చున్నందుకు ఈ వేదిక వెలిగిపోతోంది. రాజ్యాంగ పరిధిలోనే తెలంగాణ ఏర్పాటు చేశాం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా తెలంగాణ ఏర్పాటు జరిగింది అనడం హాస్యాస్పదం. తెలంగాణ ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు గడిచినందుకు సంతోషంగా ఉంది. తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణలో పరిస్థితులు మారనందుకు దుఖంగా ఉంది. తెలంగాణ రైతుల సమస్యలు, కార్మికుల సమస్యలు అలాగే ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కాస్త పక్కకి వెళ్లి చూస్తే తెలంగాణలో ఉన్న పరిస్థితులు తెలుస్తాయి. తెలంగాణలో పరిస్థితులు చూసి సోనియా, రాహుల్ బాధ పడుతున్నారు. తెలంగాణ బాధలు మార్చడానికి కాంగ్రెస్ కృషి చేస్తుంది. తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు రావాలి. అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్ళాలనేది కాంగ్రెస్ ఆలోచన. మీరు ఎప్పుడు పిలిచినా.. ఒక కాల్ చేయగానే నేను తెలంగాణకి వచ్చేస్తా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలి.’’ నేతలకు ఆమె సూచించారు.

Updated Date - 2023-06-02T15:51:34+05:30 IST