Congress: పార్టీ ఎన్నికల కమిటీని ప్రకటించిన కాంగ్రెస్

ABN , First Publish Date - 2023-09-04T21:44:49+05:30 IST

ఏఐసీపీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikharjuna Kharge) నేతృత్వంలో కాంగ్రెస్(Congress) కేంద్ర ఎన్నికల కమిటీని ప్రకటించింది.

Congress: పార్టీ ఎన్నికల కమిటీని ప్రకటించిన కాంగ్రెస్

ఢిల్లీ : ఏఐసీపీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikharjuna Kharge) నేతృత్వంలో కాంగ్రెస్(Congress) కేంద్ర ఎన్నికల కమిటీని ప్రకటించింది.ఈ కమిటీలో మొత్తం 16 మందితోఎన్నికల కమిటీని నియమించింది. కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో తెలంగాణ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం లభించింది. కమిటీలో సభ్యులుగా మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, అంబికా సోనీ, అధీర్ రంజన్ చౌదరి, సల్మాన్ ఖుర్షీద్, మధుసూదన్ మిస్ర్తీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీఎస్ సింగ్ దేవ్, ప్రితం సింగ్, మహమ్మద్ జావేద్, అమీ యజ్ఞిక్, పీఎల్ పునియా, ఓంకార్ మార్కం, కేసీ వేణుగోపాల్ ఉన్నారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

Updated Date - 2023-09-04T21:44:49+05:30 IST