TS News: కారులో అచేతన స్థితిలో వ్యక్తి... సీఐ వెళ్లి చూడగా...

ABN , First Publish Date - 2023-03-31T09:25:12+05:30 IST

ఈ మధ్య కాలంలో తరచూ గుండెపోటుకు గురై చనిపోతున్నారు అన్న వార్తలు తరచూ వినపడుతూనే ఉన్నాయి.

TS News: కారులో అచేతన స్థితిలో వ్యక్తి... సీఐ వెళ్లి చూడగా...

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో తరచూ గుండెపోటు (HeartAttack)కు గురై చనిపోతున్నారు అన్న వార్తలు తరచూ వినపడుతూనే ఉన్నాయి. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా పలువురు హార్ట్‌ఎటాక్‌కు గురవుతున్నారు. జిమ్ చేస్తూ ఒకరు, షెటిల్ ఆడుతూ మరొకరు, పెళ్లివేడుకలో, క్లాస్‌లో పాఠాలు చెబుతూ, డ్యాన్స్ చూస్తూనే ఉన్నట్టుండి కుప్పకూలి క్షణాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోతున్నారు. అదృష్టం కొద్ది కొందరిని గుండెపోటుకు గురైన వెంటనే సీపీఆర్‌ చేయడంతో మళ్లీ ఊపిరి పోసుకుంటున్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించి సకాలంలో చికిత్స అందజేయడంతో ప్రాణాలు నిలుస్తున్నాయి. ఇలాంటి ఘటనే నగరంలోని పెద్ద అంబర్‌పేటలో చోటు చేసుకుంది. గుండెపోటుకు గురైన వ్యక్తికి రామన్నపేట సీఐ మోతీరాం సీపీఆర్‌ చేసిన మానవత్వాన్ని చాటుకున్నారు. పెద్ద అంబర్ పేట వద్ద ఆగి ఉన్న కారులో ఓ వ్యక్తికి గుండెపోటు వచ్చింది. ఎవరినీ పిలవలేని స్థితిలో సదరు వ్యక్తి అచేతనంగా పడి ఉన్నారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న సీఐ మోతీరాం బాధితున్ని గమనించాడు. గుండెపోటుకు గురైన గుర్తించిన సీఐ.. వెంటనే అతడికి ఘటనాస్థలిలోనే సీపీఆర్ చేశారు. కొద్దిసేపటికి బాధితుడు స్పృహలోకి రావడంతో హుటిహుటిన బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్యులు చికిత్స అందజేయడంతో ఆ వ్యక్తి ప్రాణాలు నిలిచాయి. సమయస్ఫూర్తితో బాధితుడికి సీపీఆర్ చేసిన సీఐ మోతీరాంను ప్రశంసిస్తున్నారు.

Updated Date - 2023-03-31T09:25:12+05:30 IST