Chikoti praveen: ఎట్టకేలకు చికోటి ప్రవీణ్‌కు లైన్‌క్లియర్.. మధ్యాహ్నం బీజేపీలో చేరిక

ABN , First Publish Date - 2023-10-07T11:50:37+05:30 IST

ఇటీవల చికోటి ప్రవీణ్‌కు బీజేపీ ఆఫీస్‌లో ఘోర అవమానం జరిగింది. పార్టీలో చేరేందుకు పెద్ద ఎత్తున తన అనుచరులతో వస్తే చేర్చుకునేందుకు పార్టీ పెద్దలు నిరాకరించారు. కండువా కప్పేందుకు పార్టీ ఆఫీస్‌లో ఎవరు లేకపోవడంతో నిరాశతో

Chikoti praveen: ఎట్టకేలకు చికోటి ప్రవీణ్‌కు లైన్‌క్లియర్.. మధ్యాహ్నం బీజేపీలో చేరిక

హైదరాబాద్: ఎట్టకేలకు చికోటి ప్రవీణ్‌కు (Chikoti praveen) బీజేపీ లైన్ క్లియర్ చేసింది (BJP). ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. బర్కత్‌పురా బీజేపీ కార్యాలయంలో ఆయన కమలం పార్టీలో చేరనున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. చికోటి ప్రవీణ్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.

ఇటీవల చికోటి ప్రవీణ్‌కు బీజేపీ ఆఫీస్‌లో ఘోర అవమానం జరిగింది. పార్టీలో చేరేందుకు పెద్ద ఎత్తున తన అనుచరులతో వస్తే చేర్చుకునేందుకు పార్టీ పెద్దలు నిరాకరించారు. కండువా కప్పేందుకు పార్టీ ఆఫీస్‌లో ఎవరు లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. అంతకముందు మాజీ మంత్రి కృష్ణయాదవ్‌కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అనంతర పరిణామాల తర్వాత పార్టీలో చేర్చుకున్నారు. తాజాగా చికోటి ప్రవీణ్‌కు బీజేపీ అగ్ర నాయకత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు.

చికోటి ప్రవీణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. భాగ్యనగరంలో ఏదొక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. మోదీ స్ఫూర్తితోనే బీజేపీలో చేరుతున్నట్లు ఇటీవల ఆయన వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-10-07T12:09:58+05:30 IST