Chikoti praveen: బీజేపీలో చేరిన చికోటి ప్రవీణ్

ABN , First Publish Date - 2023-10-07T15:04:28+05:30 IST

చికోటి ప్రవీణ్ బీజేపీలో చేరారు. శనివారం జేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రాం చందర్ రావు, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా గౌతం రావు.. చికోటి ప్రవీణ్‌కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Chikoti praveen: బీజేపీలో చేరిన చికోటి ప్రవీణ్

హైదరాబాద్: చికోటి ప్రవీణ్ (Chikoti Praveen) బీజేపీలో చేరారు. శనివారం జేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna), మాజీ ఎమ్మెల్సీ రాం చందర్ రావు, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా గౌతం రావు.. చికోటి ప్రవీణ్‌కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన అనంతరం చికోటి మీడియాతో మాట్లాడుతూ... తిరునాల్లల్లో తప్పి పోయిన పిలగాడు మాదిరిగా తిరిగి తిరిగి తల్లి వొడికి చేరినట్లుగా ఉందన్నారు. బీజేపీ పటిష్టత కోసం పని చేస్తానని అన్నారు. అన్ని పార్టీలకు తెలంగాణలో అవకాశం ఇచ్చారని తెలిపారు. ప్రజలారా ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నానన్నారు. ఈ మధ్యనే పార్టీలో చేరాల్సి ఉన్నప్పటికీ చిన్న మిస్ కమ్యునికేషన్ గ్యాప్ కారణంగానే అప్పుడు పార్టీలో చేరలేకపోయానని తెలిపారు. ఏది ఏమైనా బీజేపీ లో చేరడం హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చారు. క్రమశిక్షణ కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని చికోటి ప్రవీణ్ కొనియాడారు.

Updated Date - 2023-10-07T15:04:44+05:30 IST