Vijayashanti: బండి సంజయ్ అధ్యక్ష మార్పు ఉండదు

ABN , First Publish Date - 2023-01-23T23:31:43+05:30 IST

బీజేపీ(BJP)లో బండి సంజయ్(Bandi Sanjay) అధ్యక్ష మార్పు ఉండదని ఆ పార్టీ సీనియర్ నేత విజయశాంతి( Vijayashanti) అన్నారు.

 Vijayashanti: బండి సంజయ్ అధ్యక్ష మార్పు ఉండదు

హైదరాబాద్: బీజేపీ(BJP)లో బండి సంజయ్(Bandi Sanjay) అధ్యక్ష మార్పు ఉండదని ఆ పార్టీ సీనియర్ నేత విజయశాంతి( Vijayashanti) అన్నారు. సోమవారం సోషల్ మీడియా(Social media)లో రాములమ్మ ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌ని యథాప్రకారం ఇస్తున్నాం. ‘‘తెలంగాణలో మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నేతృత్వంలోనే బీజేపీ ఎన్నికలకు వెళుతుందని నేను గతంలో ఎన్నోసార్లు చెప్పా. మా పార్టీ ముఖ్యనేతలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కొద్ది రోజుల క్రితం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ విషయమై మీడియా ద్వారా స్పష్టత ఇచ్చినప్పటికీ... తాజాగా ఒక మీడియా మిత్రుడు సంజయ్ అధ్యక్ష పదవి గురించి మా పార్టీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్‌ని ప్రశ్నిస్తే ఆయన కూడా ఎంతో స్పష్టంగా మళ్లీ బదులిచ్చారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ(pm narendra modi) సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర(praja sagrama yatra)ను ప్రశంసించడాన్ని లక్ష్మణ్(Laxman) గుర్తు చేస్తూ ప్రధాని ఇచ్చిన కితాబే సంజయ్ కొనసాగింపునకు సంకేతమని తేల్చి చెప్పారు. సందిగ్ధతలు బీజేపీలో ఎన్నడూ ఉండవు. కేసీఆర్(kcr) కుయుక్తుల ప్రచారాలు ఇక్కడ చెల్లవు. జాతీయవాదులు, హిందూ బంధువులు, బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ శివాజీ(shivaji) మహరాజ్ ప్రతిరూపపు ఆవేశంతో, నరేంద్ర మోదీ స్ఫూర్తితో బండి సంజయ్ అధ్యక్షతన రాబోయే ఎన్నికల రణక్షేత్రానికి ఇప్పటి నుంచే అనుక్షణం సైనికులై పనిచేసే సందర్భం ఆసన్నమైంది.అడుగడుగునా కలిసి నడుద్దాం... ప్రతి ప్రజా సమస్యపై పోరాడుదాం... బీజేపీ రాజ్యం తెలంగాణలో సాకారం చేద్దాం’’ అని విజయశాంతి తెలిపారు.

Updated Date - 2023-01-23T23:31:48+05:30 IST