Group-1 exam: రేపు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష

ABN , First Publish Date - 2023-06-10T18:44:40+05:30 IST

ఆదివారం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష (Group-1 prelims exam) నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రూప్-1 పరీక్షకు 3,80,072 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Group-1 exam: రేపు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష

హైదరాబాద్: ఆదివారం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష (Group-1 prelims exam) నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రూప్-1 పరీక్షకు 3,80,072 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే 3,00,004 మంది అభ్యర్థులు హాల్టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. గతంలో గ్రూప్-1 పరీక్ష 2,86,051 మంది అభ్యర్థులు రాశారు. గత అక్టోబర్ 16న గ్రూప్-1 పరీక్ష నిర్వహించారు. పేపర్ లీక్‌ నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను టీఎస్‌పీఎస్సీ (TSPSC) రద్దు చేసింది. గ్రూప్ 1 పరీక్షల (Group-1 exams) నిర్వహణకు హైకోర్టు (High Court) గ్రీన్‌సిగ్నలిచ్చిన విషయం తెలిసిందే. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తుండడంతో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. గ్రూప్‌-1తోపాటు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ), డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏవో) పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను తిరిగి జూన్‌ 11న నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ), టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి సంబంధించిన పరీక్షలను రద్దు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 80 వేల ఉద్యోగాల భర్తీలో భాగంగా 19 విభాగాల్లో 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం మొత్తం 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి గతేడాది అక్టోబరు 16న 1019 కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. సుమారు 2.86 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 25,050 మందిని మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేశారు. జూన్‌లో మెయిన్‌ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ, ఇంతలోనే పేపర్‌ లీకేజీ వ్యవహారం బహిర్గతం కావడం, ప్రిలిమినరీ పరీక్షను అధికారులు రద్దు చేశారు.

Updated Date - 2023-06-10T18:44:48+05:30 IST