TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్సీ కేసులో చార్జ్‌షీట్‌ దాఖలు

ABN , First Publish Date - 2023-06-09T15:58:10+05:30 IST

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో (TSPSC Paper Leak) సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో సిట్ అధికారులు చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్సీ కేసులో చార్జ్‌షీట్‌ దాఖలు

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో (TSPSC Paper Leak) సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో సిట్ అధికారులు చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. పేపర్ లీక్ కేసులో రూ.1.63 కోట్ల లావాదేవీలు జరిపినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 49 మందిని అరెస్ట్ చేశామని, పేపర్ లీక్ కేసులో 49 మంది మధ్యవర్తులు ఉన్నారని సిట్ తెలిపింది. మరోవైపు న్యాయసలహా తీసుకొని వచ్చే వారంలో అభియోగపత్రం దాఖలు చేసే యోచనలో సిట్ ఉంది. ఇప్పటి వరకు 49 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇందులో 15 మంది నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డితో పాటు మిగతా నిందితులంతా జైల్లోనే ఉన్నారు. ఇదిలా ఉంటే పూల రమేష్ అరెస్ట్‌తో ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు కొత్త మలుపు తిరిగింది. పూల రమేషే హైటెక్ మాస్ కాపీయింగ్ చేయించినట్లుగా గుర్తించారు. ఏఈ ప్రశ్నాపత్రాన్ని దాదాపు 80 మందికి పూల రమేష్ విక్రయించాడు. ఇతని నుంచి రాబట్టిన కీలక సమాచారంతో అరెస్ట్‌ల సంఖ్య మరింత పెరిగే అవకాశ ఉంది.

Updated Date - 2023-06-09T15:58:10+05:30 IST