Share News

TS Results: ఇంకా ఆర్డీఓ కార్యాలయంలోనే పోస్టల్‌ బ్యాలెట్లు.. కాంగ్రెస్ నేతల ఆందోళన

ABN , First Publish Date - 2023-12-02T21:21:13+05:30 IST

రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ( Ibrahimpatnam ) 29 వ తేదీ నాటి పోస్టల్‌ బ్యాలెట్లు ( Postal Ballots ) ఇంకా ఆర్డీఓ కార్యాలయంలోనే ఉన్నాయి. ఈ పోస్టల్‌ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూమ్‌కి‌ అధికారులు పంపించలేదు. ఈ విషయం తెలిసి కాంగ్రెస్ ( Congress ) శ్రేణులు ఆర్డీఓ కార్యాలయం వద్దకు భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు.

TS Results: ఇంకా ఆర్డీఓ కార్యాలయంలోనే పోస్టల్‌ బ్యాలెట్లు.. కాంగ్రెస్ నేతల ఆందోళన

రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ( Ibrahimpatnam ) 29 వ తేదీ నాటి పోస్టల్‌ బ్యాలెట్లు ( Postal Ballots ) ఇంకా ఆర్డీఓ కార్యాలయంలోనే ఉన్నాయి. ఈ పోస్టల్‌ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూమ్‌కి‌ అధికారులు పంపించలేదు. ఈ విషయం తెలిసి కాంగ్రెస్ ( Congress ) శ్రేణులు ఆర్డీఓ కార్యాలయం వద్దకు భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నాయకుల ఆందోళనతో కొద్దిసేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్లను అధికారులు స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు.

పోస్టల్ బ్యాలెట్ తరలించిన తర్వాతే అధికారులు సీల్ వేశారు. పోలింగ్ జరిగి రెండు రోజులు దాటినా స్ట్రాంగ్ రూమ్‌కు తాళం లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాళం ఎందుకు వేయలేదని ఆర్డీఓను కాంగ్రెస్ శ్రేణులు నిలదీశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా ఆర్డీఓ ఆఫీస్‌లో ఎందుకు పెట్టుకున్నారని కాంగ్రెస్ నాయకులు నిలదీశారు.

మరిన్ని తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - 2023-12-02T21:33:06+05:30 IST