Share News

Manda krishna: కేసీఆర్ అహంకారంపై ఈటల గెలిచారు

ABN , First Publish Date - 2023-11-28T16:12:38+05:30 IST

తెలంగాణను తమ జాగీరుగా భావిస్తున్న కేసీఆర్‌ను (Cm kcr) ఓడించడానికి బీజేపీ అభ్యర్థి ఈటల గజ్వేల్‌కు వచ్చారు.

Manda krishna: కేసీఆర్ అహంకారంపై ఈటల గెలిచారు

సిద్దిపేట జిల్లా: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ అహంకారంపై ఈటల రాజేందర్ గెలిచారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda krishna Madiga) అన్నారు. గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్, మంద కృష్ణమాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడారు. ‘‘తెలంగాణను తమ జాగీరుగా భావిస్తున్న కేసీఆర్‌ను (Cm kcr) ఓడించడానికి బీజేపీ అభ్యర్థి ఈటల గజ్వేల్‌కు వచ్చారు. నాకు ఏ పదవి కావాలన్నా ఇచ్చే వారు ఉన్నారు. కానీ మాదిగ ఉద్యమం నీరు కారుతుందని తీసుకోలేదు. ఎస్సీ వర్గీకరణ చేస్తానని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అందుకే నో కాంగ్రెస్ అన్నాను. కేసీఆర్‌కు మాదిగల పట్ల కృతజ్ఞతా భావం లేదు. అందుకే మాదిగలను అణిచి వేస్తుంది.’’ అని ఆరోపించారు.

Updated Date - 2023-11-28T16:12:39+05:30 IST