Share News

భూపాలపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2023-11-28T07:45:56+05:30 IST

భూపాలపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూపాలపల్లి మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుడు రడపాక సారయ్య ఎలక్షన్ విధులు నిర్వహిస్తుండగా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆస్పత్రిలో సారయ్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదని నిరసిస్తూ భూపాలపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు రాస్తారోకోకు దిగారు.

భూపాలపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద  ఉద్రిక్తత

జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూపాలపల్లి మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుడు రడపాక సారయ్య ఎలక్షన్ విధులు నిర్వహిస్తుండగా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆస్పత్రిలో సారయ్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదని నిరసిస్తూ భూపాలపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు రాస్తారోకోకు దిగారు. భాదితుడికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని... అతనికి ఏమైనా అయితే కుటుంబం రోడ్డున పడుతుందని కార్మికుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కార్మికుల ఆందోళనతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే సారయ్యను ఆదుకోవాలని, మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల ఆందోళనకు బీజేపీ అభ్యర్థి చందుపట్ల కీర్తి రెడ్డి మద్దతు తెలిపారు.

Updated Date - 2023-11-28T07:45:57+05:30 IST