Share News

Etela Rajender: ‘నీ దగ్గరకు నేనొస్తే.. నువ్వు కామారెడ్డి పారిపోయావ్’.. కేసీఆర్‌పై ఈటల వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-11-25T13:22:52+05:30 IST

Telangana Elections: జిల్లాలోని ములుగు మండలంలోని కొత్తూరుతో పాటు పలు గ్రామాల్లో బీజేపీ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో గజ్వేల్ బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘హుజూరాబాద్‌కు నువ్వు రాకపోతే నీ దగ్గరకే నేనోస్త అని గజ్వేల్‌కు వచ్చిన.. నేను వచ్చాక నువ్వు కామారెడ్డి పారిపోయావు’’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఈటెల వ్యాఖ్యలు చేశారు.

Etela Rajender: ‘నీ దగ్గరకు నేనొస్తే.. నువ్వు కామారెడ్డి పారిపోయావ్’.. కేసీఆర్‌పై ఈటల వ్యాఖ్యలు

సిద్దిపేట: జిల్లాలోని ములుగు మండలంలోని కొత్తూరుతోపాటు పలు గ్రామాల్లో బీజేపీ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో గజ్వేల్ బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ (Gajwal BJP Candidate Etela Rajender) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘హుజూరాబాద్‌కు నువ్వు రాకపోతే నీ దగ్గరకే నేనోస్త అని గజ్వేల్‌కు వచ్చిన.. నేను వచ్చాక నువ్వు కామారెడ్డి పారిపోయావు’’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఈటెల వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) సభకు ప్రజలు రాకుండా ఉండేందుకు కేసీఆర్ దావత్లు చేస్తున్నారన్నారు. ఈటెల పేదోళ్ల వైపు, ధర్మం వైపు ఉంటాడని... ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ అన్యాయానికి వ్యతిరేకంగా పిడికిలి ఎత్తుతాడని స్పష్టం చేశారు. బీజేపీకి అధికారం ఇస్తే కేసీఆర్ కాదు.. కేసీఆర్ (CM KCR) జేజెమ్మతో కొట్లడుతా అని అన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో 30 వేల మంది కేసీఆర్ బాధితులు ఉన్నారన్నారు. కేసీఆర్‌‌కు ప్రజల మీద నమ్మకం లేక బ్రోకర్లకు డబ్బులు ఇచ్చి ప్రజలకు దావతులు, డబ్బులు ఇచ్చి మోసం చేయాలని చూస్తున్నారని ఈటెల రాజేందర్ విరుచుకుపడ్డారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-25T13:35:42+05:30 IST