Share News

Congress : కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లోకి పాల్వాయి స్రవంతి..!

ABN , First Publish Date - 2023-11-11T09:33:50+05:30 IST

Telangana Congress : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి పాల్వాయి స్రవంతి గుడ్ బై చెప్పనున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పోటీ చేశారు. అప్పట్లో ఆమె మూడో స్థానంలో నిలిచారు. తాజాగా బీజేపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ ఇవ్వడం, పార్టీలో ప్రాధాన్యత తగ్గడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. నేడు లేదా రేపు కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. .

Congress : కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లోకి పాల్వాయి స్రవంతి..!

నల్గొండ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. అభ్యర్థుల ప్రకటన, నామినేషన్ల విషయంలో ఒకట్రెండు వివాదాలు జరిగినప్పటికీ ప్రశాంతంగా కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కాంగ్రెస్‌కు పాల్వాయి స్రవంతి గుడ్ బై చెప్పనున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పోటీ చేశారు. అప్పట్లో ఆమె మూడో స్థానంలో నిలిచారు. తాజాగా బీజేపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ ఇవ్వడం, పార్టీలో ప్రాధాన్యత తగ్గడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. నేడు లేదా రేపు కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. అయితే అంతకు ముందు కూడా పాల్వాయి స్రవంతి పార్టీ మారుతారంటూ ప్రచారం జరిగింది. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని.. తనకు అసలు ఆ అవసరమే లేదని తెలిపారు. సీన్ కట్ చేస్తే తాజాగా ఆమె పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైపోయారు.

Updated Date - 2023-11-11T10:01:25+05:30 IST