TS News : చర్చిలో రాత్రంతా ప్రార్థనలు చేసి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

ABN , First Publish Date - 2023-07-08T08:02:21+05:30 IST

గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఆటోలో నలుగురు ప్రయాణిస్తున్న అక్కడికక్కడే మృతి చెందింది. ఐదుగురికి గాయాలయ్యాయి.

TS News : చర్చిలో రాత్రంతా ప్రార్థనలు చేసి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

ఆదిలాబాద్: గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఆటోలో నలుగురు ప్రయాణిస్తున్న అక్కడికక్కడే మృతి చెందింది. ఐదుగురికి గాయాలయ్యాయి. ఇచ్చోడలో ఓ చర్చిలో తెల్లవారుజాము వరకు ప్రార్థనలలో పాల్గొని తెల్లవారుజామున 4 గంటలకు ఆదిలాబాద్‌కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులంతా ఆదిలాబాద్ పట్టణంలోని రవీంద్రనగర్‌కు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-07-08T08:04:57+05:30 IST