India vs Australia, 4th Test : నిలకడగా ఆడుతున్న కోహ్లీ..భారత్ స్కోర్ ఎంతంటే..?

ABN , First Publish Date - 2023-03-12T11:04:34+05:30 IST

నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi Stadium) వేదికగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో(Border-Gavaskar Trophy) ...

India vs Australia, 4th Test : నిలకడగా ఆడుతున్న కోహ్లీ..భారత్ స్కోర్ ఎంతంటే..?

అహ్మదాబాద్: నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi Stadium) వేదికగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో(Border-Gavaskar Trophy) భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య జరుగుతున్న నాల్గవ టెస్టు(Fourth Test) ఆట ప్రారంభమైంది. భారత్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. ఓవర్ నైట్ స్కోర్ 289/3 నాల్గవ రోజు ఆటను ప్రారంభించింది. విరాట్ కోహ్లీ(Virat Kohli) హాఫ్ సెంచరీతో దూకుడుగా కనిపిస్తున్నాడు. రవీంద్ర జడేజా, కోహ్లీ కలిసి హాఫ్ సెంచరీ (57) పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మరోవైపు వికెట్ల కోసం ఆస్ట్రేలియా బౌలర్లు(Australian bowlers) కట్టుదిట్టమైన బంతులు వేస్తున్నారు. కానీ టీమిండియా బ్యాటర్లు ఎటువంటి అవకాశం ఇవ్వడం లేదు. ఇదే క్రమంలోనే ఆల్ రౌండర్ జడేజా(All rounder Jadeja) మర్ఫీ బౌలింగ్‎లో ఓ చెత్త షాట్ ఆడటంతో మిడాన్‎లో ఖావాజా చేతికి చిక్కి పెవిలియన్ బాటపట్టాడు. దీంతో భారత్ జట్టు 309 పరుగుల వద్ద నాల్గవ వికెట్ ను కోల్పోయింది.

జడేజా ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన మరో బ్యాట్స్‎మెన్ శ్రీకర్ భరత్(Shrikar Bharat). మరో ఎండ్‎లో విరాట్ కోహ్లీతో కలిసి నిలకడగా ఆడుతున్నాడు. ఇక కింగ్ కోహ్లీ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఆసీస్ బౌలర్లకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఆచితూచి తొచినప్పుడల్లా బౌండరీలు బాదుతున్నాడు. ప్రసుత్తం భారత్ స్కోర్ 120 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. కోహ్లీ 186 బంతుల్లో 5 ఫోర్లతో 71 రన్స్ చేయగా.. భరత్ 38 బంతుల్లో ఒక ఫోర్, సిక్సర్ 17 పరుగులు చేసి క్రీజులో కొనసాగుతున్నారు. ఇంకా ఆస్ట్రేలియా కంటే భారత్ జట్టు 148 పరుగుల వెనుకంజలో ఉంది.

Updated Date - 2023-03-12T11:12:01+05:30 IST