WTC Final Aus vs India: అర్థసెంచరీతో భారత్‌ను ఆదుకున్న రహానే.. స్కోర్ ఎంతంటే..

ABN , First Publish Date - 2023-06-09T16:46:57+05:30 IST

మూడో రోజు జరుగుతున్న ఈ ఉత్కంఠ పోరులో తొలి ఓవర్‌లోనే టీం ఇండియా 38.2 ఓవర్ల వద్ద 152 పరుగులు చేసి 6 వికెట్ కోల్పోయింది.

WTC Final Aus vs India: అర్థసెంచరీతో భారత్‌ను ఆదుకున్న రహానే.. స్కోర్ ఎంతంటే..

లండన్: కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియాతో (Australia) జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (ICC World Test Championship Final) మ్యాచ్‌లో టీం ఇండియా (India) విజయ అవకాశాలు దాదాపు చేజారిపోయినట్లే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోర్ సాధించడం.. భారత జట్టు టాప్ ఆర్డర్ కుప్పకూలడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు.

అయితే మూడో రోజు జరుగుతున్న ఈ ఉత్కంఠ పోరులో తొలి ఓవర్‌లోనే టీం ఇండియా 38.2 ఓవర్ల వద్ద 152 పరుగులు చేసి 6వ వికెట్ కోల్పోయింది. బోలాండ్ బౌలింగ్‌లో శ్రీకర్ భారత్ ఆరో వికెట్ రూపంలో ఔటయ్యాడు. దీంతో భారత్ జట్టు మరింత కష్టాల్లో పడింది.

ప్రస్తుతం టీం ఇండియా 54.2 ఓవర్ల వద్ద 6 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. అజింక్య రహానే నిలకడగా ఆడుతూ అర్థ సెంచరీ చేసి భారత్‌ను కష్టాలను నుంచి కొంత గట్టెక్కించాడు.

రహానే 108 బంతుల్లో 68 పరుగులు చేశాడు. రహానే నిలకడగా ఆడుతూ భారత్‌ జట్టు స్కోర్ 200 దాటేలా చేశాడు. శార్దూల్ ఠాకూర్ 64 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ప్రస్తుతం రహానే, శార్దూల్ ఠాకూర్ క్రీజులో ఉన్నారు.

Updated Date - 2023-06-09T16:57:58+05:30 IST