Women's Day 2023: ఆర్సీబీ-గుజరాత్ మ్యాచ్‌పై బీసీసీఐ కీలక ప్రకటన

ABN , First Publish Date - 2023-03-07T20:48:00+05:30 IST

మహిళల ఐపీఎల్‌(WPL)లో భాగంగా బుధవారం గుజరాత్ జెయింట్స్(GG)-రాయల్ చాలెంజర్స్

 Women's Day 2023: ఆర్సీబీ-గుజరాత్ మ్యాచ్‌పై బీసీసీఐ కీలక ప్రకటన

ముంబై: మహిళల ఐపీఎల్‌(WPL)లో భాగంగా బుధవారం గుజరాత్ జెయింట్స్(GG)-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ లీగ్‌లో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. ఈ రెండు జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడినప్పటికీ బోణీ కొట్టలేకపోయాయి. ఈ నేపథ్యంలో బుధవారం నాటి మ్యాచ్ రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. మరోవైపు, ఈ మ్యాచ్ నేపథ్యంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది.

బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(Womens Day) పురస్కరించుకుని ఈ మ్యాచ్ టికెట్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. కాగా, మహిళల ప్రీమియర్ లీగ్‌కు మహిళా ప్రేక్షకులను ఇప్పటికే ఉచితంగా అనుమతిస్తుండగా, బుధవారం (8న) పురుషులను కూడా ఉచితంగా అనుమతించనున్నట్టు ప్రకటించింది. పురుషులకు ప్రస్తుతం రూ. 100 నుంచి రూ.400 రేంజ్‌లో టికెట్లను విక్రయిస్తోంది.

Updated Date - 2023-03-07T20:59:10+05:30 IST