Wife: మీ కూతురికి ఆరోగ్యం బాగాలేదంటూ అల్లుడి నుంచి మామకు ఫోన్.. పెళ్లయిన 45 రోజుల తర్వాత షాకింగ్ సీన్..!

ABN , First Publish Date - 2023-06-21T17:35:59+05:30 IST

ఆడపిల్లలకు పెళ్లి చేసి అత్తారింటికి పంపేశారనే మాటే కానీ తల్లిదండ్రుల మనసంతా అత్తారింట్లో ఉన్న కూతురుమీదనే ఉంటుంది. కూతురి ఆరోగ్యం బాగలేదనే మాట వినగానే ఆ తల్లిదండ్రులు హడావిడిగా వెళ్ళారు కానీ..

Wife: మీ కూతురికి ఆరోగ్యం బాగాలేదంటూ అల్లుడి నుంచి మామకు ఫోన్.. పెళ్లయిన 45 రోజుల తర్వాత షాకింగ్ సీన్..!

ఆడపిల్లలకు పెళ్లి చేసి అత్తారింటికి పంపేశారనే మాటే కానీ తల్లిదండ్రుల మనసంతా అత్తారింట్లో ఉన్న కూతురుమీదనే ఉంటుంది. తల్లిదండ్రుల దగ్గర రాజకుమారిలా పెరిగిన ఆడపిల్ల,అత్తింటికి వెళ్ళి అన్ని విషయాలలో సర్థుకుపోతూ ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఆ తండ్రి తన కూతురుకి పెళ్ళి చేసి అత్తారింటికి పంపి 45రోజులే అయ్యింది. ఆ తండ్రి 'నా కూతురు ఎలా ఉందో..'అని ఆలోచిస్తూ ఉంటే మీ అమ్మాయికి ఆరోగ్యం బాలేదంటూ అల్లుడి నుండి ఫోన్ వచ్చింది. ఏమయ్యిందో ఏమోనని విలవిల్లాడుతూ కూతురి దగ్గరకు వెళ్లాడు ఆ తండ్రి. ఆ తరువాత జరిగిన విషయాలు చాలా షాకింగ్ గా ఉన్నాయి. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోక వెళితే..

బీహార్(Bihar) రాష్ట్రం బక్స్రర్ జిల్లాలో కొత్తగా పెళ్ళయిన ఓ యువతి విషయంలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. బీహర్ రాష్ట్రం భోజ్ పూర్ జిల్లాలోని మహారాజా గ్రామంలో నిషాకుమారి అనే 23ఏళ్ళ యువతి(23 years women) నివసిస్తోంది. ఆమెకు బక్సర్ కు చెందిన మంతు సింగ్ తో మే 2వ తేదీన వివాహం జరిగింది. నిషా తల్లిదండ్రులు తమ స్థాయికి తగినట్టు కట్నకానుకలు(dowry & gifts) ఇచ్చి కూతురిని అత్తారింటికి పంపించారు. కానీ ఆ కట్నకానుకలతో వరుడి కుటుంబం తృప్తిపడలేకపోయింది. దీంతో తనకు మొబైల్ కావాలని, బైక్ కావాలని(son-in-law demand mobile, bike) తరచుగా నిషా తండ్రిని డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. నిషా తండ్రి ఆర్థికపరిస్థితి అంతంతమాత్రమే కావడంతో అతను అల్లుడి డిమాండ్స్ తీర్చలేదు. ఈ కారణంతో మంతు సింగ్ నిషాను కొట్టడం, వేధించడం మొదలుపెట్టాడు.

Viral: ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేదు.. కానీ ఇప్పుడు ఏడాదికి రూ.85 లక్షలు సంపాదన.. బస్సు కండక్టరే కానీ..!


ఈ క్రమంలోనే మంతు సింగ్ నిషా తండ్రికి ఫోన్ చేసి 'మీ అమ్మాయి ఆరోగ్యం బాగాలేదు' అంటూ సమాచారం అందించాడు. ఆ విషయం వినగానే కూతురికి ఏమయ్యిందో ఏమోనని నిషా తల్లిదండ్రులు, సోదరుడు నిషా దగ్గరకి హడావిడిగా వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూస్తే నిషాకు ఏమీకాలేదు. ఆమె ఆరోగ్యంగానే కనిపించింది. దీంతో నిషా తల్లిదండ్రులు కంగారు తగ్గించుకుని తిరిగి తమ గ్రామానికి వెళ్లిపోయారు. కానీ వారు వెళ్ళిన రెండురోజుల తరువాత డాక్టర్ దగ్గరకు చెకప్ కు వెళదామంటూ నిషాను ఆమె అత్తమామలు హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. తిరిగి ఇంటికి వచ్చిన తరువాత విషమిచ్చి ఆమెను హత్య చేశారు. అనారోగ్యంతో మరణించిందని అందరికీ ప్రచారం చేశారు. నిషా తల్లిదండ్రులు నిషా మృతదేహాన్ని అప్పగించమని అడగ్గా మంతు నింగ్ తల్లిదండ్రులు మృతదేహాన్ని అప్పగించడానికి నిరాకరించారు. దీంతో నిషా తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు, జరిగిన సంఘటనలన్నీ పోలీసులకు వివరించారు. పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేసుకుని నిషా మృతదేహాన్ని పోస్ట్ మార్టం కు పంపించారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తరువాత మిగతా చర్యలు తీసుకుంటామన్నారు.

Shocking: ఏడుస్తూ గగ్గోలు పెడుతున్న ఓ పాప.. పొలంలో ఉన్న ఓ వ్యక్తి అనుమానంతో గోడపై నుంచి ఆ ఇంట్లోకి తొంగి చూస్తే..!


Updated Date - 2023-06-21T17:35:59+05:30 IST