చెత్తకుప్పను తవ్వుతుండగా కనిపించిందో బాక్స్.. అనుమానంతో ఆ చెత్తనంతా పక్కకు తీయగానే కనిపించిన దృశ్యం చూసి పోలీసులకు షాక్..!

ABN , First Publish Date - 2023-03-20T15:51:36+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఓ విచిత్ర వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అపరిచిత వ్యక్తి నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఓ గ్యారేజ్ దగ్గరకు వెళ్లి అన్వేషణ ప్రారంభించారు.

చెత్తకుప్పను తవ్వుతుండగా కనిపించిందో బాక్స్.. అనుమానంతో ఆ చెత్తనంతా పక్కకు తీయగానే కనిపించిన దృశ్యం చూసి పోలీసులకు షాక్..!

మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) సాగర్ జిల్లాలో ఓ విచిత్ర వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అపరిచిత వ్యక్తి నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఓ గ్యారేజ్ దగ్గరకు వెళ్లి అన్వేషణ ప్రారంభించారు. గ్యారేజ్ వెనకాల వారికి పెద్ద చెత్త కుప్ప కనిపించింది. దానిని తవ్వగా వారికి ఓ అనుమానాస్పద బాక్స్ కనిపించింది. మొత్తం తవ్వి చెత్తనంతా పక్కకు తీస్తే వారికి వరుసగా పదుల సంఖ్యలో బాక్స్‌లు కనిపించాయి. వాటిని తెరిచి చూడగా అందులో వందల సంఖ్యలో మద్యం సీసాలు (Liquor bottles) బయటపడ్డాయి.

సాగర్ జిల్లాలోని పిపారియా జైత్‌పూర్ గ్రామంలో ఖేర్మాత దేవాలయం ఎదురుగా ఉన్న గ్యారేజ్ ఎన్‌క్లోజర్‌లో పెద్ద మొత్తంలో మద్యం ఉంచినట్లు ఇన్‌ఫార్మర్ నుంచి పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఆ గ్యారేజ్‌పై దాడి చేశారు. పోలీసు బృందం గ్యారేజ్ ఎన్‌క్లోజర్ వద్దకు చేరుకుని సోదాలు చేసింది. కానీ అక్కడ ఏమీ దొరకలేదు. ఇంతలో ఎన్‌క్లోజర్‌లో విస్తరించిన గడ్డిని తొలగించగా, మద్యం స్టాక్ కనిపించింది. ఒకదాని తర్వాత ఒకటిగా 19 మద్యం బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు (Crime News).

కొడుకు బర్త్‌డేను ఘనంగా చేసిన 3 గంటలకే ఊహించని ఘటన.. 5 ఏళ్ల ఆ బాబు నిద్రపోగానే ఆ తల్లి చేసిన పనేంటంటే..

ఘటనా స్థలంలో 19 బాక్సుల్లో 918 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలించడానికి ఏర్పాటు చేసుకున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు మహేంద్ర సింగ్ డాంగిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతడిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

నా జీవితం ఎంతో సంతోషంగా ఉండేది.. ఒక్క అమ్మాయి మొత్తం మార్చేసింది.. అంటూ ఆ యువకుడు చేసిన పని ఏంటో తెలిస్తే షాక్

Updated Date - 2023-03-20T15:51:36+05:30 IST