Viral: డబ్బులు సంపాదించడానికి ఇదో కొత్త రకం టెక్నిక్.. 24 ఏళ్ల ఈ యువతి ఏం చేసి మరీ లక్షల్లో డబ్బు కూడబెట్టిందో తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-07-17T16:09:06+05:30 IST

డబ్బు సంపాదించడం కోసం చాలా తెలివైన, మరెంతో విభిన్న పద్దతులు ఫాలో అవుతారు. ఓ మహిళ కూడా డబ్బు సంపాదించడానికి వింత పద్దతి ఫాలో అయ్యింది. 24ఏళ్ళ వయసుకే..

Viral: డబ్బులు సంపాదించడానికి ఇదో కొత్త రకం టెక్నిక్.. 24 ఏళ్ల ఈ యువతి ఏం చేసి మరీ లక్షల్లో డబ్బు కూడబెట్టిందో తెలిస్తే..!

డబ్బు లేకుంటే జీవితాలు గడవవు. కానీ డబ్బు సంపాదించాలంటే సమయం, దాంతో పాటు కష్టం కూడా వెచ్చించాలి. అన్నింటికీ మించి తెలివి తేటలుండాలి. కొందరు చాలా సులువుగా డబ్బు సంపాదించాలని అనుకుంటారు. అందుకోసం చాలా తెలివైన, మరెంతో విభిన్న పద్దతులు ఫాలో అవుతారు. ఓ మహిళ కూడా డబ్బు సంపాదించడానికి వింత పద్దతి ఫాలో అయ్యింది. 24ఏళ్ళ వయసుకే ఆమె చేసిన పనితో లక్షలు ఆమె ఒళ్ళో వచ్చి వాలాయి. కర్ణాటకకు చెందిన ఈ మహిళ చేసిన పనేంటి? ఆమె అంత సులువుగా లక్షలాది రూపాయలు ఎలా సంపాదించింది? ఆ తరువాత జరిగిందేంటి? పూర్తీగా తెలుసుకుంటే..

'ధనం మూలం ఇదం జగత్' అన్నారు పెద్దలు. ఈ ప్రపంచం డబ్బు(Money) ఆధారంగానే నడుస్తోంది. అందుకే డబ్బు కోసం మనుషులు ఏమైనా చేస్తారు. కష్టపడి కొందరు డబ్బు సంపాదిస్తే మరికొందరు కూర్చున్నచోటనుండి కదలకుండా సులువుగా సంపాదించాలని అనుకుంటారు(easy money). ఇలా సులువుగా సంపాదించాలని అనుకునేవారిలో చాలామంది చేసే పని ఇతరులను మోసం చేయడం, మాయమాటలతో మభ్యపుచ్చి, అబద్దాలు చెప్పి వారినుండి డబ్బు తీసుకోవడం. నిషా నరసప్ప(24) అనే యువతి కూడా అదే పని చేసింది. కర్ణాటకకు(Karnataka) చెందిన నిషా అనే యువతి ఈవెంట్ షో(event shows) లు నిర్వహించేది. ఈమె ఎన్ఎన్ ప్రొడక్షన్స్ అండ్ ఈవెంట్స్ ను నడుపుతోంది. దానికి మేనేజర్(event manager) గా ఈమె వ్యవహరిస్తోంది. ఈమె తనకు సూపర్ స్టార్లు, సినీనటులతో చాలా పరిపచయాలు ఉన్నాయని చెప్పి చాలా మందిని ఆకర్షించింది. దీని కోసం రియాలిటీ హోస్ట్ ఆనంద్(reality host Anand) ఫోటోను అతని కూతురు వంశిక ఫోటోలను తెలివిగా ఉపయోగించుకుంది.

Scooty Video: ఇంటి బయటే స్కూటీని పార్క్ చేస్తున్నారా..? ఎందుకైనా మంచిది ఒక్కసారి ఈ వీడియోను చూడండి..!


రియాలిటీ హోస్ట్ ఆనంద్, ఆయన కూతురు ఫోటోలను చూసిన పలువురు ఆమె నిజంగానే అవకాశాలు ఇప్పిస్తుందని భ్రమ పడ్డారు. డాన్స్ లో ఆసక్తి ఉన్న తమ పిల్లలను సెలబ్రిటీలను చేయాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఆమెను కాంటాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో నిషా వారందరి వద్ద నుండి లక్షలాదిరూపాయలు వసూలు చేసింది. అయితే గతవారం బెంగుళూరులోని సదాశివనగర్ లోని ఓ కేప్ లో పిల్లల తల్లిదండ్రులు నిషా ను కలిశారు. పిల్లలకు ఆవకాశాలు ఇప్పించడం లేదేంటని నిషాను నిందిస్తూ తమ డబ్బు తమకు తిరిగి ఇచ్చేయమని ఆమెను డిమాండ్ చేశారు. ఈ విషయం మొత్తం రియాలిటీ షో హోస్ట్ ఆనంద్ భార్య యశశ్వినికి తెలిసింది. ఆమె నిషా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఆమె ఫిర్యాదు మేరకు బెంగుళూరు పోలీసులు నిషాను అరెస్ట్ చేశారు.

Viral Video: అమ్మ బాబోయ్.. దీనికి ఎంత ధైర్యం.. నడిరోడ్డుపై చిరుత పులి కాచుకుని కూర్చుందని చూసి కూడా..!


Updated Date - 2023-07-17T16:09:06+05:30 IST