Delhi Crime: ఢిల్లీ నడిరోడ్డుపై క్రైమ్ సీన్.. యువతిని కొడుతూ వ్యాన్‌లోకి బలవంతంగా ఎక్కిస్తున్న యువకులు.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2023-03-19T15:57:45+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీ అకృత్యాలకు, దురాగతాలకు అడ్డాగా మారుతోంది. వరుసగా జరుగుతున్న ఘోరాలతో ఢిల్లీ జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

Delhi Crime: ఢిల్లీ నడిరోడ్డుపై క్రైమ్ సీన్.. యువతిని కొడుతూ వ్యాన్‌లోకి బలవంతంగా ఎక్కిస్తున్న యువకులు.. వీడియో వైరల్

దేశ రాజధాని ఢిల్లీ (Delhi Crimes) అకృత్యాలకు, దురాగతాలకు అడ్డాగా మారుతోంది. వరుసగా జరుగుతున్న ఘోరాలతో ఢిల్లీ జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. తాజాగా ఓ యువతిపై కొందరు యువకులు దారుణానికి పాల్పడ్డారు (Crime News). నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా కిడ్నాప్ చేశారు. శనివారం రాత్రి ఢిల్లీలోని మంగోల్ పురి ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది (Viral Video).

మంగోల్‌పురి ఫ్లైఓవర్ సమీపంలో ఓ యువతిని ఒక వ్యక్తి బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించాడు (Girl Kidnap). అనంతరం ఆమెను కొట్టాడు. కళ్ల ముందే అంత జరుగుతున్నా ఎవరూ అడ్డుకోవడానికి రాకపోవడం విషాదకరం. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. పోలీసులు ఆ వీడియో ఆధారంగా విచారణ ప్రారంభించారు. నెంబర్ ఆదారంగా కారు ఓనర్ హర్యానాలోని గురుగ్రామ్‌లోని రతన్ విహార్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతను క్యాబ్ డ్రైవర్ అని, అతని వ్యాన్‌లోకి ఎక్కిన ముగ్గురు వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తోంది.

Viral Video: పాకిస్థాన్ బోర్డర్ నుంచి భారత్‌లోకి ఎవరు వచ్చారో చూడండి.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో

క్యాబ్ డ్రైవర్ చెప్పిన దాని ప్రకారం ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉబర్ ద్వారా వికాస్‌పురికి వాహనం బుక్ చేసుకున్నారు. దారిలో, వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆ అమ్మాయి కారులోంచి దిగి వెళ్లిపోవాలనుకుంది. వెంటనే అప్రమత్తమైన ఆ ఇద్దరు యువకులు ఆ అమ్మాయిని బలవంతంగా కారులోకి ఎక్కించారు. ప్రస్తుతం వారి కోసం గాలిస్తున్నట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-03-19T15:57:45+05:30 IST