Taraka Ratna: చంద్రబాబు నివాళులు.. అలేఖ్య భావోద్వేగం!

ABN , First Publish Date - 2023-03-02T16:41:38+05:30 IST

నందమూరి తారకరత్న దశదిన కర్మను గురువారం హైదరాబాద్‌ ఎఫ్‌ఎన్‌సీసీ కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని తారకరత్నకు నివాళులు అర్పించారు. బాలకృష్ణ దగ్గరుండి అన్ని కార్యక్రమాలను నిర్విహించారు.

Taraka Ratna: చంద్రబాబు నివాళులు.. అలేఖ్య భావోద్వేగం!

నందమూరి తారకరత్న(Nandamuri Tarakaratna) దశదిన కర్మను గురువారం హైదరాబాద్‌ ఎఫ్‌ఎన్‌సీసీ కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని తారకరత్నకు నివాళులు అర్పించారు. బాలకృష్ణ (bala krishna) దగ్గరుండి అన్ని కార్యక్రమాలను నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu naidu) దంపతులు తార్నకరత్నకు నివాళులు అర్పించిన అనంతరం అలేఖ్యను పరామర్శించారు. పిల్లల్ని దగ్గరకు తీసుకున్నారు. వారితో కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు. దాంతో అలేఖ్య (Alekhya reddy) భావోద్వేగానికి లోనయ్యారు. నందమూరి కుటుంబ సభ్యులతోపాటు వైసీపీ ఎంపీ విజయ్‌ సాయిరెడ్డి, టీడీపీ నాయకులు మాగంటి బాబు, అయ్యన్న పాత్రుడు, నిర్మాతలు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, సాయి కొరపాటి, పరుచూరి గోపాల కృష్ణ తదితరులు తారకరత్న చిత్ర పటానికి నివాళులు అర్పించారు. తారకరత్న భార్యను, బిడ్డలను చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరుమున్నీరవుతున్నారు.

జనవరి 26న యువగళం (yuvagalam)పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నకు గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. కార్యకర్తలు అభిమానులు హుటాహుటిని సమీప ఆస్పత్రికి తరలించారు. తదుపరి మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్నికి తరలించారు. అక్కడ 23 రోజులపాటు చికిత్స పొందిన ఆయన మహాశివరాత్రి రోజున కన్నుమూశారు.

ఇటీవల తారకరత్న భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఇదే మా చివరి జ్ఞాపకం’ అంటూ తిరుమలలో తీసుకున్న ఫొటో షేర్‌ చేయడంతో నెటిజన్లను భావోద్వేగానికి లోనయ్యారు. చినకర్మ రోజున అలేఖ్య పడిన వేదన చూసిన బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఆ వీడియో నెట్టింట వైరల్‌ అయిన సంగతి తెలిసిందే!

2.jpg

Updated Date - 2023-03-02T17:16:59+05:30 IST