Bihar: 4 ఏళ్ల బాలుడిపై కేసు.. బెయిల్ కోసం కోర్టు మెట్లెక్కిన తల్లి.. అసలు విషయం తెలిసి న్యాయమూర్తి విస్మయం..!

ABN , First Publish Date - 2023-03-18T17:48:58+05:30 IST

పిల్లలు దేవుడితో సమానం అంటారు పెద్దలు. పిల్లలకు సహాయం చేస్తే దేవుడికి సహాయం చేసినట్టే అంటారు. పైగా వారేం చేసినా కల్మషం లేకుండా చేస్తుంటారు. అలాంటిది ఏ

Bihar: 4 ఏళ్ల బాలుడిపై కేసు.. బెయిల్ కోసం కోర్టు మెట్లెక్కిన తల్లి.. అసలు విషయం తెలిసి న్యాయమూర్తి విస్మయం..!
Bihar

పిల్లలు దేవుడితో సమానం అంటారు పెద్దలు. పిల్లలకు సహాయం చేస్తే దేవుడికి సహాయం చేసినట్టే అంటారు. పైగా వారేం చేసినా కల్మషం లేకుండా చేస్తుంటారు. అలాంటిది ఏ పాపం తెలియని ఓ చిన్న బాలుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. బెయిల్ కోసం కోర్టు మెట్లు ఎక్కిన ఆ చిన్నారి గాధ తెలిసి న్యాయమూర్తే విస్మయం చెందాడు. ఈ సంఘటన బీహార్‌ (Bihar)లోని బెగుసరాయ్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: jackpot: ఆ కూలీ కలలో కూడా ఊహించనంత డబ్బు.. రాత్రికి రాత్రే ఏకంగా రూ.75 లక్షలకు అతడు ఎలా యజమాని అయ్యాడంటే..

2021 ఏప్రిల్‌లో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ (Lockdown) నడుస్తోంది. రెండేళ్ల వయసున్న ఓ బాలుడు సహా 8 మంది కంటైన్మెంట్ (Containment) ప్రాంతంలో పెట్టిన బారికేడ్లు తొలగించడం ద్వారా కరోనా (Corona) వ్యాప్తికి కారణమయ్యారని పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఆ చిన్నారి తల్లికి గురువారమే తెలిసింది. దీంతో బెయిల్‌ కోసం కుమారుడ్ని వెంటబెట్టుకుని కోర్టుకు వచ్చింది. ఈ కేసును విచారించిన బెగుసరాయ్‌ కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. చిన్నారిపై ఇలాంటి కేసు పెట్టడానికి, బెయిల్‌ ఇవ్వడానికి ఎటువంటి నిబంధనలు లేవని తెల్చిచెప్పింది. బాలుడిపై కేసు కొట్టివేయాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.

ఇది కూడా చదవండి: Marriage: పెళ్లి రోజే ఈ వరుడికి చుక్కలు కనిపించాయి.. ఏ గొడవా లేకుండానే వివాహం జరిగింది కానీ..

kdkd.jpg

Updated Date - 2023-03-18T17:49:37+05:30 IST