Train Accident: రైలు పట్టాలపై దొరికిన డైరీలో ‘ప్రేమ కావ్యం..’.. ఆ భగ్న ప్రేమికుడు బతికి ఉన్నాడో.. లేదో.. తెలియదు కానీ..!

ABN , First Publish Date - 2023-06-05T15:48:03+05:30 IST

తాజాగా ప్రమాద స్థలిలో దొరికిన ఓ డైరీలోని విషయాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.

Train Accident: రైలు పట్టాలపై దొరికిన డైరీలో ‘ప్రేమ కావ్యం..’.. ఆ భగ్న ప్రేమికుడు బతికి ఉన్నాడో.. లేదో.. తెలియదు కానీ..!
Love story

ఒడిశా రైలు ప్రమాదం యావత్తు దేశాన్నే కాదు.. ప్రపంచ దేశాలను కలిచివేసింది. ఊహించని ఈ ప్రమాదంలో కొన్ని వందల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపించింది. ఆ సంఘటనను గుర్తుచేసుకుంటేనే గుండెల్లో దడ పుడుతోంది. అంతగా భయకంపితుల్ని చేసింది ఈ యాక్సిడెంట్ (Coromandel train express accident). ఆ దృశ్యాలు ఇంకా కళ్ల ముందు మెదులాడుతున్నాయి. వందల మంది ప్రాణాలు కోల్పోగా.. మరెందరో క్షతగాత్రులుగా మారిపోయారు. తాజాగా ప్రమాద స్థలిలో దొరికిన ఓ డైరీలోని విషయాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.

గత శుక్రవారం (జూన్ 2) ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో (odisha Train Accident) ఓ ప్రేమకథకు సంబంధించిన ఆనవాళ్లు ప్రత్యక్షమయ్యాయి. ప్రేమకు గుర్తుగా నిలిచిన కాగితాలు దర్శనమిచ్చాయి. కాగితాలపై బెంగాలీ భాషలో అక్షరాలు రాసి ఉన్నాయి. ఈ కాగితాలు ఎవరో రాశారో తెలియదు గానీ డైరీలో నుంచీ చినిగిపోయి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రేమను వ్యక్తం చేసే సింబల్స్ కనిపించాయి. ఎవరో ప్రయాణికుడు తన ప్రియురాలిని గుర్తుచేసుకుంటూ తనలోని ప్రేమను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ డైరీలోని (love story diary) వ్యక్తిని గురించి ఇంత వరకూ ఎలాంటి సమాచారం దొరకలేదు. ‘‘నేను నిన్ను ప్రతీ నిమిషం ప్రేమించాలని పరితపిస్తుంటాను. ఎందుకంటే నువ్వు నా హృదయానికి అంతలా దగ్గరయ్యావు’’ అని డైరీలో రాసి ఉంది.

love-2.jpg

ఇంత గాఢంగా ప్రేమించిన ఆ ప్రేమికుడి అక్షరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రేమకు సంబంధించిన కాగితాలను జాగ్రత్త పరుస్తామని పోలీసుల అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ ఈ కవితలు తనవేనంటూ ఎవరూ ముందు రాలేదని చెప్పారు. ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 275 మంది చనిపోగా.. 1100 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ డైరీలోని భగ్న ప్రేమికుడు క్షేమంగా ఉండాలని నెటిజన్లు కోరుతున్నారు.

love1.jpg

Updated Date - 2023-06-05T15:52:03+05:30 IST