Tollywood: టాలీవుడ్‌‌ని వెంటాడుతున్న వరుస విషాదాలు.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి

ABN , First Publish Date - 2023-03-06T09:11:17+05:30 IST

గత కొంతకాలంగా టాలీవుడ్‌ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గతేడాది కృష్ణంరాజు, కృష్ణ‌, కైకాల స‌త్య‌నారాయ‌ణ, జమున, కె.విశ్వనాథ్, తారకరత్న ఇలా వరుసగా పలువురు తెలుగు సినీ ప్రముఖులు తుదిశ్వాస విడిచారు.

Tollywood: టాలీవుడ్‌‌ని వెంటాడుతున్న వరుస విషాదాలు.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి

గత కొంతకాలంగా టాలీవుడ్‌ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గతేడాది కృష్ణంరాజు, కృష్ణ‌, కైకాల స‌త్య‌నారాయ‌ణ, జమున, కె.విశ్వనాథ్, తారకరత్న ఇలా వరుసగా పలువురు తెలుగు సినీ ప్రముఖులు తుదిశ్వాస విడిచారు. అందులో తారకరత్న (TarakRatna) అయితే కేవలం 39 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో కన్నుమూయడం చాలా విషాదకరం. ఇలా వరుస సంఘటనలతో టాలీవుడ్‌ విషాదం నెలకొంది. తారకరత్న మరణాన్ని పూర్తిగా మరవకముందే మరో టాలీవుడ్ ప్రముఖుడు కన్నుమూశారు.

తాజాగా టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోలు (Praveen Anumol) అకాల మరణం చెందారు. తారకరత్నలాగే గుండెపోటు (Heart Attack) కారణంగా ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఆయన హఠాన్మరణంతో టాలీవుడ్ మరోసారి దిగ్భ్రాంతికి లోనైంది. ఈ విషయం తెలిసిన పలువురు తెలుగు సినీ ప్రముఖులు ప్రవీణ్‌కి సంతాపం ప్రకటించారు.

కాగా.. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ అందించగా.. 2017లో విడుదలైన ‘దర్శకుడు’ చిత్రానికి ప్రవీణ్ అనుమోలు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. అంతకుముందు బాజీరావు మస్తానీ, ధూమ్ 3, బేబీ, పంజా, యమదొంగ చిత్రాలకు అసిస్టెంట్ కెమెరామెన్‌గా వర్క్ చేశారు.

ఇవి కూడా చదవండి:

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు

Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’

Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు

Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

Updated Date - 2023-03-06T09:11:17+05:30 IST